Saturday, May 4, 2024
- Advertisement -

ఓట్లు చీలిక..కరిగిపోతున్న ఆశలు

- Advertisement -

అన్నీ తల కిందులవుతున్నాయి. బీజేపీతో పొత్తు అంటూనే నిర్ణయం పెండింగ్ లో పెట్టారు. అటు జగన్ ఎలక్షన్ డ్రైవ్ స్పీడ్ పెంచారు. అభ్యర్దుల పైన దాదాపు క్లారిటీ వచ్చేసింది. జనసేన, బీజేపీతో పొత్తుతో సీన్ మార్చాలనే చంద్రబాబు వ్యూహాలు రివర్స్ అవుతున్నాయి. సీట్ల & సామాజిక సమీకరణాలతో ఆలోచన చేస్తే ఓట్లలో చీలికలు కనిపిస్తున్నాయి.

ఒక్క పొత్తు కోసం చంద్రబాబు అడుగు ముందుకు వేస్తే అనేక నష్టాలు వెంటాడుతున్నాయి. అసలు జగన్ వ్యతిరేక ఓటు చీలకకూడదనే చంద్రబాబు , పవన్ మూల సిద్దాంతానికే బీటలు వారుతున్నాయి.

  1. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. టీడీపీ, జనసేన సీట్లు ఖరారు కాలేదు. అభ్యర్దుల్లో పోటీ ఉంది. ఒకరికి ఇస్తే మరొకరు తిరుగుబాటు ఖాయం. ఇప్పుడు బీజేపీ తోడైతే మరింత క్లిష్ఠ పరిస్థితి. టీడీపీ కోసం పని చేస్తున్న అన్ని సర్వే సంస్థలు బీజేపీతో కలిస్తే ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నాయి. కానీ, జగన్ పైన ఎలక్షన్ చేయాలంటే పొత్తు తప్పదని చంద్రబాబు వాదిస్తున్నారు.
  2. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో ఖచ్చితంగా 50కి పైగా సీట్లను టీడీపీ వదులుకోవాల్సిందే. అక్కడ ఇప్పటి వరకు జెండా మోసిన తమ్ముళ్లు ఎలాంటి పరిస్థితుల్లోనూ సహకరించే పరిస్థితి లేదు. చివరి నిమిషం వరకు సీట్లు తేల్చకుండా ఆఖర్లో ఇచ్చినా చేయలేని పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు.
  3. మూడు పార్టీల పొత్తుతో జగన్ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలకు ధీటుగా అభ్యర్దులను నిలబెట్టటం సాధ్యం కాదు. ఈ సారి ఎన్నికల్లో గెలుపు ఓటమలును నిర్దేశించింది సామాజిక సమీకరణాలే. జగన్ వ్యహాన్ని ఈ మూడు పార్టీల పొత్తుతో ఎదుర్కోవటం అసాధ్యం. జనసేన, బీజేపీ నుంచి అగ్రవర్ణాలకే పెద్ద సంఖ్యలో పోటీలో నిలచేందుకు సిద్దమవుతున్నారు.
  4. అర్బన్, జగన్ వ్యతిరేక ఓటు పైన చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. బీజేపీతో కలవటం ద్వారా ఆ పార్టీని తొలి నుంచి వ్యతిరేకించే మైనార్టీ ఓట్ బ్యాంక్ టీడీపీకి పూర్తిగా దూరం కానుంది. 2014లో మైనార్టీలకు టీడీపీ ఒక్క సీటు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మైనార్టీలు టీడీపీ వైపు నిలబడే అవకాశాలు లేవు.
  5. అర్బన్ ఓటర్లలో ప్రధానంగా అగ్రవర్ణాల్లో ప్రధాని మోదీ పైన ఆదరణ కనిపిస్తోంది. అయితే, అగవర్ణాల్లో ఆ రెండు వర్గాల వారు చంద్రబాబును వ్యతిరేకించే వారే. మోదీని నాడు వ్యక్తిగతంగా దూషించి నేడు అవసరం కోసం తిరిగి మోదీతో జత కట్టటం తో వారు సహకరించే అవకాశం లేదు.
  6. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక వర్గాలు జగన్ కు వ్యతిరేకంగా ఉన్నాయని టీడీపీ ప్రచారం. అదే నిజమైతే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఉద్యోగ – కార్మిక వర్గాలకు ప్రతినిధులుగా ఉండే వామపక్ష పార్టీలు కాంగ్రెస్ తో కలవటానికి సిద్దపడుతున్నాయి. దీంతో, ఉద్యోగ – కార్మిక వర్గాల్లో జగన్ వ్యతిరేక ఓటు టీడీపీకి పూర్తి స్థాయిలో బదిలీ అయ్యే అవకాశం ఉండదు.
  7. షర్మిల ద్వారా జగన్ ను టార్గెట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ అనుకూల ఓటు వైఎస్సార్సీపీ నుంచి ఏ పార్టీకి వెళ్లే అవకాశం ఉండదు. వ్యతిరేక ఓటు మాత్రమే మరో పార్టీకి వెళ్తుంది. ఆ ఓటు ఇప్పుడు షర్మిల ఎంట్రీతో TDP కి కాకుండా కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉంది. ఇక్కడా టీడీపీకి నష్టమే.
  8. 2019 లో టీడీపీ ఓడిన వెంటనే చంద్రబాబు కోటరీగా వ్యవహరించిన నేతలు బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీ, టీడీపీ పొత్తులో కీలకంగా ఉన్నారు. పొత్తు ఖాయమతే మరలా వారే బీజేపీ అభ్యర్దులుగా ఎన్నికల బరిలో నిలేచేందుకు సిద్దం అవుతున్నారు. ఇది నిజంగా టీడీపీ కోసం పని చేసేన వారిలో ఆగ్రహానికి కారణమవుతోంది. వారి కోసం ప్రస్తుత పరిస్థితుల్లో పని చేసే అవకాశాలు కనిపించటం లేదు.
  9. బీజేపీ పొత్తు ఖాయం చేసుకోవాలంటే ప్రధానం ఒక షరతు విధిస్తోంది. అధికారంలోకి రావటానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 88 టీడీపీ సొంతంగా సాధించే పరిస్థితి ఉండకూడదు. ఇం్రతీదుకోసం బీజేపీ 4-2-1 ఫార్ములా తెచ్చింది.
    ప్రతీ పార్లమెంట్ పరిధిలో టీడీపీ 4, బీజేపీ -2, జనసేన -1 స్థానాల్లో పోటీ చేసేలా ప్రతిపాదన చేసారు ఫలితంగా కనీసం 50-60 సీట్లు తమ రెండు పార్టీలకు దక్కేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చినా తమ మద్దతుతోనే ప్రభుత్వం కొనసాగే పరిస్థితులు ఉండాలనేది బీజేపీ ముందు గా నిర్దేశించిన వ్యూహం. ఇది చంద్రబాబు & కో కు మింగుడు పడటం లేదు.
  10. పొత్తులతో జగన్ ను ఓడించగలుగుతామని కేడర్ కు చంద్రబాబు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెర వెనుక అసలు కారణాలు ఢిల్లీ టు గల్లీ అందరికీ తెలిసినవే. ఇవే పొత్తులతో అసలు పునాదులే కదిలి పోతున్నాయని తెలుగు తమ్మళ్లు తలలు పట్టుకుంటున్నారు. సో..చంద్రబాబు పొత్తుల ఎత్తులు సొంత పార్టీతో సహా నమ్ముకున్న వారిని చిత్తు చేయటం ఖాయం కాదని చెప్పగలరా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -