Thursday, May 9, 2024
- Advertisement -

నాయకులు చాలా లేదా కార్య‌క‌ర్త‌లును కుడాన…

- Advertisement -

వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై అధికార పక్ష దాడులు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి.ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పచ్చర్ల వెంకటాపురం గ్రామంలో వైఎస్ఆర్ సిపి కార్యకర్త తిరుపతి రెడ్డి పైన చిన్న పిచ్చయ్య, అతని అనుచరులు దాడి చేయగా అతను తీవ్ర గాయాల పాలు కావడం స్థానికంగా భయాందోళన రేపుతోంది. తిరుపతి రెడ్డిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రంగా ఉండటంతో చికిత్స చేసిన డాక్టర్లు 13 కుట్లు వేశారు.

ప్రస్తుతానికి పరిస్థితి విషమంగానే ఉందని వారు చెబుతున్నారు. స్థల వివాదం విషయంలో ఇద్దరు కలిసి తనపై అన్యాయంగా దాడి చేశారని తిరుపతి రెడ్డి వాపోయాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇంతలా తెగించడం పట్ల అంతటా విస్మయం వ్యక్తమవుతోంది.దాడి చేసిన టిడిపి కార్యకర్తలు మద్యం సేవించి ఉన్నారని ప్రాధమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలా భౌతిక దాడులకు దిగటం పట్ల అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -