Tuesday, May 14, 2024
- Advertisement -

టీడీపీకి పెద్ద షాక్.. జ‌గ‌న్‌కి సహాయం చేస్తున్న చంద్ర‌బాబు టీం

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నికలో.. టీడీపీ, వైసీపీ గట్టి పోటీ పడి.. చివరకి ఉప ఎన్నిక‌లో అధికార పార్టీ టీడీపీ విజయం దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన కాకినాడ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో కూడా టీడీపీ గెలిచింది. దాంతో వచ్చే ఎన్నికల సమయాన్నికి వైసీపీ మళ్లీ పక్కా ప్రణాళికతో రావడానికి రెడీ అవుతోంది.

ఇక అధికార పార్టీ ఏపీలో 175 స్థానాల్లో రిపీట్ చేయాల‌ని చంద్ర‌బాబు తెలుగు త‌మ్ముళ్ళ‌కు క్లాసులు ఇస్తున్నాడట. ఏది ఏమైనా ఏపీలో రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ- టీడీపీల మ‌ధ్య‌ భారీ పోటీ ఖాయ‌మ‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. అధికార టీడీపీకి సంబంధించిన ఇద్ద‌రు మంత్రులకు సంబ‌ధించిన ఒక వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటివలే చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ బాబు ఓ స‌భ‌లో మాట్లాడుతూ వైసీపీ సంబంధిన 12 మంది నేత‌లు టీడీపీ లోకి వ‌చ్చేందుకు రెడీగా ఉన్నారని ఒక మాట అన్నాడు. దీంతో జాగ్ర‌త్త ప‌డిని వైసీపీ నేత‌ల్లో కొంత‌మంది మీడియా ముందుకు వ‌చ్చి అంత సీన్ లేద‌ని తేల్చి పడేశారు.

ఇప్పుడు తాజాగా మ‌రో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ నుండి గోడ దూకేందుకు రెడీగా ఉన్నార‌ని వారిలో ఆరుగురు ఎమ్మెల్యేలు కొద్ది రోజుల్లోనే సైకిల్ ఎక్క‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వైసీపీని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. అయితే వారు చేసే ప్ర‌య‌త్నంలో లీకులు బయటకు చెప్పి.. జ‌గ‌న్‌కి ప‌రోక్షంగా స‌హాయం చేస్తున్నార‌ని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -