Sunday, April 28, 2024
- Advertisement -

అభ్యర్థిని మార్చాల్సిందే.. బాబు ఇంటివద్ద ధర్నా

- Advertisement -

టీడీపీ ఫస్ట్ లిస్ట్ పుణ్యామాని చంద్రబాబుకు కంటిమీద కునుకులేకుండా పోయింది. టికెట్ దక్కని నేతలంతా అసమ్మతి గళం వినిపిస్తుండగా మరికొంతమంది మాత్రం రోడ్డెక్కి నిరసన చేపడుతున్నారు. తాజాగా చంద్రబాబు ఇంటివద్ద ధర్నాకు దిగారు తంబళ్లపల్లె టీడీపీ నేతలు.

తంబళ్లపల్లె టికెట్ శంకర్ యాదవ్ కు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆయన అనుచరులు ధర్నాకు దిగారు. తంబళ్లపల్లె టికెట్ జయచంద్రారెడ్డికి కేటాయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రారెడ్డికి కాకుండా శంకర్ యాదవ్‌కు టికెట్ కేటాయించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సెక్యూర్టీ గేట్ దాటుకుని శంకర్ యాదవ్ అనుచరులు చంద్రబాబు నివాసం లోపలకు చొచ్చుకుని వచ్చారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఇక ఇప్పటికే టికెట్లు దక్కని సీనియర్ నేతలు సైతం బహిరంగంగానే విమర్శిస్తున్న పరిస్థితి నెలకొంది. అటూ జనసేనలోనూ ఇదే పరిస్థితి. పొత్తులో భాగంగా కొన్ని సీట్లు టీడీపీకి, మరికొన్ని సీట్లు పవన్ వేరే వారికి ఇచ్చారని ఆరోపిస్తూ జనసైనికులు ఆ పార్టీ జెండాలను తగలబెడుతున్నారు. మొత్తంగా లిస్ట్ విడుదలై రెండు రోజులు గడుస్తున్న ఇంకా అసంతృప్తి మాత్రం చల్లారడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -