Wednesday, May 8, 2024
- Advertisement -

జ‌గ‌న్ దూకుడు వ‌ల్లే నంద్యాల‌లో ప్ర‌చారం

- Advertisement -

వైసీపీ అధినేత జ‌న‌న్ నామ‌స్మ‌ర‌నే చేస్తుంటారు టీడీపీ నాయ‌కులు. నోటికి వ‌చ్చి బూతు ప‌దాల‌తో ఆయ‌న‌ను విమ‌ర్శిస్తుంటారు. నిత్యం ఏదొక విష‌యంలో బాబుతో పాటు మంత్రులంద‌రూ విరుచుకు ప‌డుతుంటారు. రాజ‌కీయాల‌ల్లో ఇదంతా స‌హ‌జ‌మే అయినా…ఇప్పుడు జ‌గ‌న్ దూకుడును చూసి మెచ్చుకున్నారు మంత్రి వ‌ర్యులు.

జ‌గ‌న్ వ‌య‌సులో త‌క్కువైనా సీఎం చంద్ర‌బాబుకి మూడు చెరువుల నీల్లు తాగిస్తున్నార‌ని కితాబిచ్చారంట‌. జగన్‌తోనే ఆగక రోజాను కూడా మెచ్చేసుకున్నారట. పురుషపుంగవులు కూడా సిగ్గుతో తలదించుకునేట్టు రోజా సవాళ్లు విసురుతుంటే తాము ఏం చెప్పినా నిలవడం లేదని ఆయన కితాబిచ్చారట. ఇదంతా త‌న స‌న్నిహితుల వ‌ద్ద చెప్పారంట‌.

జ‌గ‌న్‌ను విమ‌ర్శించే వారిలో ప్ర‌ధానంగా మంత్రుల్లో అచ్చెంనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఇతర నేతల్లో వర్లరామయ్య తప్ప వైసీపీకి ధీటుగా జవాబిచ్చేవారికే కొరత ఏర్పడిందని టిడిపి నేతలు వాపోవవడం విశేషం. జగన్‌ ఇదివరకు మాట్లాడిన వాటిపై తీవ్ర విమర్శలు వచ్చినా మార్చుకోకపోగా మరింత గా దాడి చేస్తున్నారు. దీనికి ఆయన అనుయాయుల వివరణ కూడా వినదగ్గదే. ఆయన అలా మాట్లాడారు కనుకనే టిడిపి అనుకూల మీడియాలో ఈ మాత్రం ప్రచారం నెగిటివ్‌గానైనా వస్తున్నది. అదే బుద్ధిమంతుడులా సుద్దపప్పుల్లా ఏదో చెప్పుకుంటూ పోతే ఎవరు పట్టించుకుంటారని వారు ఫ్రశ్న వేస్తున్నారు. జ‌గ‌న్‌ను మెచ్చుకోవ‌డం అంటె చిన్న విష‌యం కాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -