తాడిపత్రి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు.నిత్యం ఎప్పుడూ వివాదాలతో రాజకీయాల్లో ఉంటారు.ఎవరైనా సరే ముక్కుసూటిగా వివాదాస్పదంగా మాట్లాడటం ఆయనకు వెన్నుతో పెట్టిన విద్య.అయితే చంద్రబాబు,పవన్ భేటీపై జేసీ ఆసక్తికర సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పటి నుంచో భాయి, భాయి అని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అందుకే చంద్రబాబు ఉద్దానం సమస్యను పరిష్కరిస్తున్నారని అన్నారు. నిధులు లేకపోయినా రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నారని ఆయన చెప్పారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును సాగునీటి ప్రాజెక్టులే కాపాడుతాయని ఆయన చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో వెంకయ్యనాయుడు లేకపోయినా నిధులు తీసుకొస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎక్కడున్నా వెంకయ్యనాయుడు తెలుగు ప్రజల కోసం పని చేస్తారని ఆయన చెప్పారు.
https://www.youtube.com/watch?v=Xq4R0qphHk4