జగన్ దెబ్బకు టీడీపీ పార్టీ ఎంతో బలమైన నియోజకవర్గాల్లో కూడా ఎంతటి కుదేలయిపోయిందో ఆ నియోజక వర్గాల ప్రస్తుత పరిస్థితి చూసి తెలుసుకోవచ్చు.. రాజు అనుకున్నవాడు సిపాయి లా అయిపోవడంతో రాజ్యంలో అన్ని స్థానాలు కోల్పోవడంతో కుదేలయిపోయాడు.. ఇక గెలిచినా స్థానాలనైన బాబు కాపాడుకుంటున్నాడా అంటే అదీ లేదు.. తన మొండి వైఖరి తో వారిని దూరం చేసుకుంటున్నాడు..తాజాగా గుంటూరు జిల్లా వెస్ట్ నియోజకవర్గంలో టీడీపి కి పెద్ద దెబ్బ తగిలింది.. అక్కడ ఎప్పటినుంచో బలంగా ఉన్నపార్టీ గత ఏడాది ఎన్నికల్లో జగన్ కి అంత క్రేజ్ ఉన్నా టీడీపి నే గెలిచింది.
మద్దాలి గిరి అక్కడ విజయం సాధించారు. అయితే గత 2014 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్రెడ్డి చంద్రబాబు ను ఎ స్థాయిలో విమర్శించారో అందరికి తెలిసిందే.. సొంత పార్టీ నేత అప్పుడు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు అలా విమర్శించడం పెద్ద చర్చ అయ్యిందో.. అయితే ఇప్పుడు మద్దాలి కూడా ఆయన దారిలో వెళ్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మద్దాలి గిరిధర్ కూడా వైసీపీ గూటికి చేరిపోయి.. అనధికారికంగా ఆయన వైఎస్సార్ పార్టీ నేతగా చలామణి అవుతున్నారు. దీంతో గుంటూరు వెస్ట్లో టీడీపీ జెండా మోసే నాయకుడు ఎవరూ కనిపించడం లేదు.
దీంతో గుంటూరు లో ని పార్టీ కార్యకర్తలంతా ఇక్కడ టీడీపీ కి ఏమవుతుందని వాపోతున్నారు.. అసలే నాయకులు కరువవుతున్న నేపథ్యంలో వెతికి మరీ ఓ నాయకుడిని తెచ్చుకుంటుంటే గెలిచినా తర్వాత వేరే పార్టీ లాక్కోవడం పై వారు చాల అసహనం గా ఉన్నారట.. ఇటీవల కమ్మ వర్గానికే చెందిన కోవెలమూడి రవీంద్రకు పగ్గాలు అప్పగించినా ఆయనతో పార్టీకి ఒరిగిందేమి లేదు. పైగా ఎవరిని నమ్ముదామన్నా కూడా ఎప్పుడు పార్టీ ని వీడుతాడో అని చంద్రబాబుకు ఇప్పుడు భయం వెంటాడుతోంది.ఈ నేపథ్యంలో ఇక్కడ చంద్రబాబు ఎలాంటి ఎత్తుగడ వేసి.. ఇక్కడ పార్టీని నిలబెట్టుకుంటారో ? చూడాలి.