టీడీపీ అధికార ప్రతినిధి, నటి దివ్యవాణి పార్టీని వీడుతున్నారనె వార్తలు వారం రోజులుగా సోషల్ మీడియాలో ముమ్మరంగా ప్రచారం సాగింది. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలన్న ఉద్దేశ్యంతో భాజాపా ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానె ఇప్పటికే చాలామంది నాయకులు కాషాయ కండువా కప్పుకున్నారు.
ఏపీలో అయితే టీడీపీ నేతలపై గురిపెట్టింది భాజాపా. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో పాటు పార్టీకి భవిష్యత్తు ఉండదనె ఉద్దేశ్యంతో సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి నేతలే కమలం గూటికి చేశారు. టీడీపీ ఫైర్ బ్రాండ్గా పేరున్న సాధినేని యామినీ సైతం పార్టీకి గుడ్బై చెబుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమెతో పాటు సినీ నటి దివ్యవాణి కూడా సైకిల్ దిగుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆవార్తలపై దివ్యవాణి క్లారిటీ ఇచ్చారు.
తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తన తుదిశ్వాస వరకూ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండే వారే నిజమైన నాయకులని చెప్పిన దివ్యవాణి, చంద్రబాబు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు