బీజేపీ పార్టీ ఏపీ లో రోజు రోజు కి కొంత బలపడుతున్న సంగతి తెలిసిందే.. సోము వీర్రాజు అధ్యక్ష్య పదవి చేపట్టాక ప్రజల్లోకి బీజేపీ పార్టీ వేగంగా దూసుకెళ్లింది.. అధికారంలో ఉన్న పార్టీ మాదిరి సోము ఏపీ లో బీజేపీ బలోపేతానికి చాలా చర్యలు చేపట్టి అందులో సక్సెస్ అయ్యాడని చెప్పాలి.. టీడీపీ కంటే ముందుగా ఇప్పుడు బీజేపీ పార్టీ ఉందని చెప్పడం ఎలాంటి సందేహం లేదు.. రాష్ట్ర బీజేపీ పరిస్థితి ఇలా ఉంటే ఏపీ విషయంలో సెంట్రల్ లోని బీజేపీ పరిస్థితీ వేరేలా ఉంది.. ఇన్నాళ్లు తమతో కలిసి వచ్చిన చాలా ప్రాంతీయ పార్టీ లు ఇప్పుడు మోడీ కి కొంత వ్యతిరేకమయ్యాయి.. ఎప్పుడు ఏ పార్టీ ఊడిపోతుందో అర్థం కావట్లేదు.. అందుకే వైసీపీ సపోర్ట్ కోసం మోడీ కొంత ఇంట్రెస్ట్ ను జగన్ పై పెడుతున్నారు..
ఇక టీడీపీ కూడా మోడీ కి దగ్గరయ్యే ప్రయత్నాలు బాగానే చేస్తుంది. అవసరం ఉన్నా లేకున్నా మోడీ పేరు తీసుకువచ్చి మోడీ పై తనకున్న అభిమానాన్ని చాటుకునే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నాడు.. ఇప్పుడు ఇంకొక మెట్టు ఎక్కి తిరుపతి ఎంపీ సీటు విషయంలో బీజేపీ కి పూర్తి మద్దతు ఇవ్వనున్నారట. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ సీటును బీజేపీకి ఉచితంగా ఆఫర్ చేశారట చంద్రబాబు. అంటే ఎలాంటి ఆంక్షలు లేకుండా ఉచితంగా మద్దతును ఇస్తారట. గెలవలేక కుంటి సాకులు అన్నట్లు టీడీపీ వేస్తున్న ఈ ప్లాన్ కి బీజేపీ ఏమైనా పడిపోతుందా అనే అనుమానాలు ప్రజల్లో ఇప్పుడు కలుగుతున్నాయి..
వాస్తవానికి ఇక్కడ టీడీపీ గెలిచి చాలా ఏళ్ళు అయిపొయింది. 1984లో ఇక్కడ ఎంపీ సీటు ను గెలిచినా టీడీపీ ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు గెలుపు మొహం చూడలేదు.. ఇప్పుడు అక్కడ టీడీపీ పోటీ చేసినా చేయకపోయినా పెద్ద తేడా ఉండదు. అందుకే బీజేపీకి ఈ సీటును బిస్కెట్ గా వేస్తున్నారట చంద్రబాబు. ఇదేదో తాము గెలిచే సీటు అన్నట్లు వ్యవహరిస్తూ బీజేపీ కి దారాదత్తం చేస్తున్నట్లు చంద్రబాబు మాట్లాడడం విడ్డురంగా ఉంది.. అయితే ఇక్కడ చంద్రబాబు వ్యూహం ఏమిటో స్పష్టం అవుతోంది. ఒకవేళ చంద్రబాబు వేసే ఈ బిస్కెట్ కు బీజేపీ పడితే ఆ పార్టీకి అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. వాస్తవానికి లోక్ సభలో బీజేపీకి కొత్తగా అదనపు బలం అక్కర్లేదు కూడా. ఇలాంటి నేపథ్యంలో కూడా చంద్రబాబు తెలివిగా విసురుతున్న ఈ బిస్కెట్ ను ఆశించి, బరిలోకి దిగితే.. బీజేపీ మరోసారి చంద్రబాబు ట్రాప్ లో చిక్కుకుపోవడం మొదలైనట్టే..
చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయం ఇదేనా…?
జంపింగ్ జపాంగ్లను పక్కన పెట్టిన బాబు..!