తెలంగాణాలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్తల జాబితా హడావుడి అన్ని పార్టీలకు మొదలయ్యింది. ఇప్పటికే టీడీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్తుల జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో కలసి మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలసిందే. కాంగ్రెస్ తన తొలి అభ్యర్తుల జాబితాను ప్రకటించేందుకు సిద్దమవుతోంది.
నవంబర్ 2న పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహాకూటమిలో భాగంగా టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్… వారికి 25 నుంచి 29 సీట్లకు వదిలేసి 90 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది.
ఇప్పటికే ఈ జాబితాపై రాష్ట్రంలో ముఖ్యనేతలతో చర్చించిన స్క్రీనింగ్ కమిటీ సభ్యులు…. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఈ జాబితాను సమర్పిస్తారని… రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ జాబితా విడుదలవుతుందని సమాచారం. నవంబర్ 2న కాంగ్రెస్ పార్టీ ప్రకటించే జాబితాలో వీరి పేర్లు ఉండబోతున్నాయని గాంధీ భవన్ వర్గాలనుంచి సమాచారం. ఈ మొదటి జాబితాలో ఉత్తమ్ భార్య పేరు లేకపోవడం గమనర్హం.
కొడంగల్- రేవంత్ రెడ్డి
గద్వాల్ – డీకే అరుణ
వనపర్తి- చిన్నారెడ్డి
కల్వకుర్తి- వంశీచంద్ రెడ్డి
అలంపూర్- సంపత్ కుమార్నాగర్ కర్నూల్- నాగం జనార్ధర్ రెడ్డి
షాద్ నగర్- ప్రతాప్ రెడ్డి
మధిర- భట్టి విక్రమార్క
గోషామహల్- ముఖేష్ గౌడ్
సనత్ నగర్- మర్రి శశిధర్ రెడ్డి
జూబ్లీహిల్స్- విష్ణు వర్ధన్ రెడ్డి
నాంపల్లి- ఫిరోజ్ ఖాన్
మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి
పరిగి- రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్- ప్రసాద్ కుమార్
హుజూర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి
నాగార్జునసాగర్- జానారెడ్డి
ఆలేరు- బిక్షమయ్య గౌడ్
నల్లగొండ-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నకిరేకల్- చిరుమర్తి లింగయ్య
తుంగతుర్తి- అద్దంకి దయాకర్
జహీరాబాద్- గీతారెడ్డి
ఆందోల్- దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి- జగ్గారెడ్డి
నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి
గజ్వేల్ – ఒంటేరు ప్రతాప్ రెడ్డి
అసిఫాబాద్- ఆత్రం సక్కు
ఖానాపూర్- రమేశ్ రాథోడ్
బోథ్- సోయం బాపురావు
నిర్మల్- మహేశ్వర్ రెడ్డి
ములుగు- సీతక్క
భూపాల్ పల్లి-గండ్ర వెంకటరమణారెడ్డి
జనగాం- పొన్నాల లక్ష్మయ్య
నర్సంపేట- మాధవరెడ్డి
మంథని- శ్రీధర్ బాబు
కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
సిరిసిల్ల- కేకే మహేందర్ రెడ్డి
పెద్దపల్లి- విజయరమణారావు
జగిత్యాల- జీవన్ రెడ్డి
బాల్కొండ- అనిల్
కామారెడ్డి- షబ్బీర్ అలీ
బోధన్- సుదర్శన్ రెడ్డి