చాణిక్యున్ని చంపి పుట్టినోన్ని అనే కోటా డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ డైలాగ్ ఏపీసీఎం చంద్రబాబు నాయుడికి చక్కగా సరిపోతుంది. రాజకీయాలు చేయడంలో చాణిక్యుని తర్వాత అంతలా రాజకీయాలు చేడంలో బాబు దిట్ట. చాణిక్యుడు దేశ సమైక్యానికి రాజకీయీలు చేస్తే…బాబు మాత్రం తన స్వంత లాభం కోసం కుటుంబ రాజకీయాలు చేయడం బాబుకు వెన్నుతో పెట్టిన విద్యే.
ఇప్పటి వరకు పొత్తు లేకుండా టీడీపీ ఎన్నికలకు వెల్లిన సందర్భాలు లేవు. దాంతోపాటు కుటుంబ రాజకీయాలు చేయడంలో దిట్ట. తెలంగాణాలో పార్టీ అవసాన దశలో ఉంది. కనీసం ఉనికినైనా చాటుకోవాలనే ఉద్యేశ్యంతో కాంగ్రెస్ పార్టీతో కలసి మహాకూటమిని ఏర్పాటు చేశారు. కూకట్ పల్లి నియోజక వర్గ స్థానం నుంచి నందమూరి హరికృష్ణ కూతురు సుభాసిని పేరుని అనూహ్యంగా తెరపైకి తెచ్చి నామినేషన్ వేయించారు.
నందమూరి సుహాసిని అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని బాబు వేసిన ప్లాన్కు అన్నదమ్ములిద్దరు ట్విట్టర్లో స్లీట్ గా షాక్ ఇచ్చారు. ఆ ట్విట్ ఇప్పుడ టీడీపీలో సంచలనంగా మారింది. సోదరులిద్దరూ కలిసి ఒకే జూనియర్ ఎన్టీయార్ ట్విట్టర్ ఖతా నుండే ట్వీట్ చేయటం గమనార్హం. ఆ ట్వీట్ లో ఎక్కడ కూడా టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు కానీ బాబాయ్ నందమూరి బాలకృష్ణ పేరుకానీ కనీసం ప్రస్తావించక పోవడంతో బాబు కంగుతిన్నారంట. వారిద్దరు ప్రచారం చేస్తారని ఆశ పెట్టుకుంటే…అడియాశలు చేశారని బాబు సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం.
టిడిపి తమ తాత తర్వాత తమ తండ్రికే వస్తుందని చెప్పకనే చెప్పారు. తమ సోదరికి విజయం వరించాలని ఆకాంక్షిస్తున్నట్లు మాత్రమే చెప్పారు. అంతేకాని నందమూరి అభిమానులు, తమ అభిమానులు సుహాసిని విజయానికి కృషి చేయాలని ఎక్కడా పేర్కొనలేదు.
నామినేషన్ వేసిన సందర్భంగా సుహాసిని కూడా సోదరుల ప్రచారం గురించి అడిగినా దాటవేయటం గమనార్హం. ఈ ట్వీట్ ద్వారా అర్ధమైందేమిటంటే, చంద్రబాబుకు తమకు సంబంధం లేదని. అంతేకాకుండా తెలుగుదేశంపార్టీ తమదే అని ఇన్ డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చారనుకోవాలి.