Thursday, May 2, 2024
- Advertisement -

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్​ లో ఆ అభ్యర్థి ముందంజ..!

- Advertisement -

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్​ కొనసాగుతోంది. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం తొలి రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానం ఓట్ల లెక్కింపు రెండో రౌండ్​లో టి.ఆర్.ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 3,787 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15,857 ఓట్లు రాగా.. తీన్మార్‌ మల్లన్నకు 12,070 ఓట్లు వచ్చాయి. కోదండరాంకు 9,448 ఓట్లు, ప్రేమేందర్‌రెడ్డికి 6,669 ఓట్లు, రాములు నాయక్‌ (కాంగ్రెస్‌)కు 3,244 ఓట్లు పోలయ్యాయి.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో మొదటి రౌండ్​ ఫలితాలు వచ్చాయి. తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో సురభి వాణీదేవికి 17,439 ఓట్లు, రాంచందర్‌రావుకు 16,385 ఓట్లు, ప్రొ.నాగేశ్వర్‌కు 8,357 ఓట్లు, చిన్నారెడ్డి (కాంగ్రెస్)కి 5,082 ఓట్లు వచ్చాయి.

భారీగా ఓట్లు పోలవడంతో ఫలితాలు మరింతగా ఆలస్యం అయ్యే అవకాశముంది. అటు సిబ్బంది అవగాహన లేమితోనూ కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా కొనసాగుతోంది. రెండు నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు లీడింగ్‌లో నిలిచారు. ఐతే స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుండడంతో.. ఫలితాలపై ఉత్కండ నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -