Saturday, May 11, 2024
- Advertisement -

అభ్య‌ర్తిని గెలిపిస్తేనే….అభివృద్ధి….

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నికలో అధికార పార్టీ భ‌రితెగింపుల‌కు పాల్ప‌డుతోంది.ఎలాగైనా గెల‌వాల‌ని సీఎం ఆదేశించ‌డంతో అడ్డ‌దారులు తొక్కుతూ ప్ర‌తిప‌క్ష‌పార్టీ నాయ‌కుల‌తోపాటు ప‌బ్లిగ్‌గ్గా ప్ర‌జ‌ల‌ను కూడా బ్లాక్ మెయిల్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంది.ఓట‌ర్ల‌ను మ‌భ్య‌పెట్టేందుకు వ‌రాల జ‌ల్లు కురుపిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం చంద్ర‌బాబు నంద్యాల ప‌ర్య‌ట‌న వ‌చ్చిన‌పుడు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన ఇప్పుడు చేస్తాం.. రోడ్లు వేసేది మాత్రం.. నంద్యాల్లో టీడీపీ అభ్యర్థి గెలిస్తేనే, ఇళ్ల పట్టాలకు, ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు ఇప్పుడు తీసుకుంటాం.. కానీ ఇళ్లను నిర్మించేది మాత్రం నంద్యాల్లో టీడీపీ అభ్యర్థి గెలిస్తేనే.. ఇవీ ప్రభుత్వం తరపు నుంచి వినిపిస్తున్న మాటలు.మీకు ప‌నులు కావాలంటె త‌మ అభ్య‌ర్తిని గెల‌పించాల్సిందేన‌ని ష‌రుతులు విధిస్తున్నారు.

గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గ ఇప్పుడు నంద్యాల్లో కొన్ని వందలకోట్ల రూపాయల విలువజేసే డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌కు శంకుస్థాపనలు జరిగాయి. ఇవన్నీ కూడా టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తేనే పూర్తి అవుతాయి అని టీడీపీ నేతలు ఓపెన్‌గా చెబుతున్నారు. పబ్లిక్‌ను పబ్లిక్‌గానే బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు.

ప్ర‌జ‌ల‌ను డైరెక్ట్‌గా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. ప్రజలకు ఆశలు పెట్టి.. రాజకీయం చేస్తున్నారు. దీని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. ఈ తెగింపు రాజకీయాన్ని, ప్రలోభ రాజకీయాన్ని ప్రజలు ఎంతవరకూ సహిస్తారు.. అనేది ఇక్కడ వచ్చే ఫలితాన్ని బట్టి అర్థం అవుతుంది.

ఎమ్మెల్సీ పదవిని ఇస్తా, మండలి చైర్మన్‌ పదవిని ఇస్తా.. అని సీనియర్‌ నేత ఫరూక్‌కు హామీ ఇచ్చారు చంద్రన్న. కానీ.. నంద్యాల్లో భూమా బ్రహ్మానందరెడ్డి గెలిస్తేనే.. అని చంద్రబాబు స్పష్టం చేశారు.గ‌తంలో కూడా బుబుకు అవ‌స‌రం ఉన్న‌ప్పుడు ప‌ద‌వుల ఆశ‌లు చూపించి త‌ర్వాత మొండిచేయి చూపారు.మ‌రి ఇప్పుడు ఫ‌రూక్‌కు అయినా అదృష్టం క‌ల‌సి వ‌స్తాదో లేక హ్యండ్ ఇస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -