ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో నైరాశ్యంలో ఉన్న టీడీపీ శ్రేణులలో ఉత్సాహం నింపేందుకు బాబు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పార్టీలో ఉత్తేజం నింపేందకు పక్కా ప్రణాలికతో ముందుకెల్తున్నారు. పార్టీ కేడర్ను ఓటమినుంచి బయటకు తెచ్చేందుకు పూనుకున్నారు. ఎక్కువకాలం నిరాశలో కూరుకుపోవడం ద్వారా పార్టీ నేతలు పక్క పార్టీల వైపు చూసే అవకాశం ఉందని భావిస్తున్న చంద్రబాబు… సాధ్యమైనంత తొందరగా మళ్లీ వారిని యాక్టివ్ చేయాలని ముంఉదకు సాగుతున్నారు.
అయితే గత కొంత కాలంగా ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం బాబు దృష్టికి వెల్లడంతో అలర్ట్ అయ్యారు. కృష్ణా జిల్లాలోని మొత్తం 16 స్థానాల్లో టీడీపీ 2 స్థానాలను గెలుచుకుంది. విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ టీడీపీ తరపున విజయం సాధించారు. అయితే వీరిద్దరూ పార్టీ వ్యవహారాల్లో పాల్గొనకుండా సైలెంట్ అయిపోయారు. ప్రజావేదక కూల్చివేసె సమయంలో తూతూ మంత్రంగా స్పందించిన ఇద్దరు నేతలు ఇప్పుడు దూరంగా ఉన్నారు. అ ఇద్దరి ఎమ్మెల్యేల అంతరంగ బాబుకు అర్థం కాక అయోమయంలో ఉన్నారు. వారితో పాటు సీనియర్ నేతలు కూడా సైలెంట్ అవ్వడంతో బాబులో టెన్షన్ మొదలయ్యింది.