Wednesday, May 1, 2024
- Advertisement -

వంశీ ఇమేజ్..జగన్‌ మైలేజ్..గన్నవరం వైసీపీదే!

- Advertisement -

ఏపీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ తనదైన ప్రచారంతో హ్యాట్రిక్ దిశగా పరుగులు పెడుతున్నారు. కృష్ణా జిల్లా గన్నవం…టీడీపీకి కంచుకోట. 2009 నుండి ఇక్కడ టీడీపీ జెండా ఎగురుతోండగా 2014,2019లో వల్లభనేని వంశీ విజయం సాధించారు.

అయితే ఈసారి వంశీ వైసీపీ నుండి పోటీ చేస్తుండగా గత ఎన్నికల్లో వంశీపై వైసీపీ నుండి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావ్ ఈసారి టీడీపీ నుండి పోటీ చేస్తున్నారు. ఇక గన్నవరం స్థానంను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ. చంద్రబాబు, ఆయన ఫ్యామిలీ అంటే తీవ్ర విమర్శలు చేస్తారు వంశీ. అందుకే ఆయన్ని ఓడించేందుకు వైసీపీ నుండి టీడీపీలో చేరిన నేతకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. తాను చేసిన సేవా కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని చెబుతున్నారు వెంకట్రావ్.

ఇక వంశీ మాత్రం గన్నవరంలో తన మార్క్ స్పష్టంగా క్రియేట్ చేశారు. ఇక్కడ టీడీపీ ఇమేజ్ కంటే వంశీ ఇమేజే ఎక్కువ. దీనికి తోడు జగన్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి తోడవడంతో తన గెలుపును ఎవరు ఆపలేరని తేల్చి చెబుతున్నారు. ఇద్దరు నేతలు ఆర్థికంగా గట్టి పట్టున్న వారే కాగా గన్నవరం సీటులో గెలిచేది ఎవరనేది మాత్రం ఉత్కంఠగానే మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -