Friday, May 17, 2024
- Advertisement -

ఏ చరిత్ర లేని లఫూట్ గాడు రంగా గురించి మాట్లాడడమేంటి

- Advertisement -

వంగ‌వీటి రంగాపై గౌతంరెడ్డి చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో విజ‌య‌వాడ అట్టుడుకుతోంది. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై లో వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణ సోమవారం విరుచుకుపడ్డారు. వాడెంత? వాడి బతుకెంత? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో సిపిఐని అడ్డుపెట్టుకుని గౌతమ్ రెడ్డి చేసిన భూదందాలు, దౌర్జన్యాలు అందరికి తెలుసని చెప్పారు. రెండు మర్డర్లు చేసి, భూదందాలు చేసి నగరబహిష్కరణకు గురైన వ్యక్తి మాటలకు విలువలేదని తేల్చేసారు.

తల్లిని చూసి ఏడ్చిన రాధా, బెజవాడలో హైటెన్షన్.. ఏ చరిత్ర లేని లఫూట్ గాడు రంగా గురించి మాట్లాడడమేంటి? అని ఫైర్ అయ్యారు. చనిపోయినవారి గురించి నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదన్నారు. తమను విమర్శించే స్థాయి వాడికి లేదని,వాడి బతుకేంటో, వాడి పరిస్థితేంటో అందరికీ తెలుసుని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. వాడి భూకబ్జాలు, కేబుల్ కబ్జాలు, హత్య కేసుల గురించి అందరికీ తెలుసన్నారు. ఇలాంటి ఎధను ప్రోత్సహించినందుకు తమ పార్టీ బాధపడుతోందన్నారు.

అభిమానులు ఆగ్రహానికి గురైతే ఎంతటి వాడైనా బ్రష్టుపట్టిపోతాడని మండిపడ్డారు. మా సహనాన్ని పరీక్షించవద్దని, రంగాగారి అభిమానులు ఒక స్థాయి వరకు సహనంతో ఉంటారని హెచ్చరించారు. రంగా అభిమానులు‌ పార్టీలకు అతీతంగా ఉన్నారు. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఊరుకోరని చెప్పారు.

పోలీసులు‌ తమ బాసుల దగ్గర మార్కులకోసం నిన్నటి నుండి అత్యుత్సాహం ప్రదర్శించారని అబిప్రాయపడ్డారు. మహిళా కానిస్టేబుళ్ళు లేకుండా తన తల్లిని రోడ్డుపై ఈడ్చుకుని తీసుకెళ్ళటం దారుణమన్నారు. హాస్పటల్ కు తీసుకు వెళ్ళమన్నా వినలేదు దీని పై ఫిర్యాదు చేస్తామ‌న్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -