Monday, April 29, 2024
- Advertisement -

ఇద్ద‌రి మ‌ధ్య ర‌స‌వ‌త్త‌రంగా మారిని ఎన్నిక‌

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక హీట్ పెరిగిపోతోంది.రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి.నిన్న‌టి వ‌ర‌కు సాదార‌నంగా ఉన్న విమ‌ర్శ‌లు ఇప్పుడు మాట‌ల యుధ్దం ముద‌రుతోంది.శిల్పా,భూమా అఖిల ఇద్ద‌రి మ‌ధ్య మాటల యుద్ధం సాగుతోంది. బుధవారం ఇరువురు నేతలు పరస్పరం మాటల యుద్ధానికి దిగారు.

శిల్పా మోహన్ రెడ్డిపై మంత్రి భూమా అఖిలప్రియ నిప్పులు చెరిగారు. ఓట్లు అడగడానికి మోహన్ రెడ్డి వస్తే… ఆయనను చొక్కా పట్టుకుని నిలదీయాలని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నంద్యాలకు ఇప్పటి వరకు ఏం చేశావని ప్రశ్నించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. శిల్పా మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైందని ఆమె అన్నారు. అనారోగ్యంతో ఉన్న ఆయన ఎన్నిసార్లు ఆసుపత్రికి వెళ్లాలో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. భూమా నాగిరెడ్డిపై తప్పుడు కేసులు పెట్టించిన చరిత్ర శిల్పా మోహన్ రెడ్డిది అని అన్నారు.

టిడిపి తమపై అసత్య ప్రచారం చేస్తోందని ఆవేదన శిల్పా మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విషప్రచారం సరికాదన్నారు. నంద్యాల అభివృద్ధికి రూ.1200 కోట్లు ఇచ్చామని చెబుతున్నారే తప్ప, ఇవ్వలేదన్నారుఅభివృద్ధి కోసం డబ్బులు ఏమైనా చంద్రబాబు ఇంట్లో నుంచి తీసుకు వచ్చి పెడుతున్నారా అని శిల్పా మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. నంద్యాల అభివృద్ధికి టిడిపి చేసిందేమీ లేదన్నారు.

నామినేష‌న్ల ప‌ర్వం ముగిసిన త‌ర్వాత ఎన్నిక‌ల వేడి మ‌రింత వేడెక్క‌నుంది.ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్‌కూడా ప్ర‌త్య‌క్షంగా రంగంలోకి దిగ‌నున్నారు.మూడ‌వ‌తేది భారీ బ‌హిరంగ స‌భ ద్వారా ఎన్నిక‌లో ఎంట్రీ ఇవ్వ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -