Friday, May 17, 2024
- Advertisement -

బాబును మరోసారి ఘోరంగా అవమానించిన మోడీ…

- Advertisement -

విభజనతో అన్నీ నష్టపోయిన ఆంద్రప్రదేశ్‌కి అన్నీ తెస్తానని చెప్పి వందల కొద్దీ హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి గద్దెనెక్కాడు చంద్రబాబు. మోడీ బొమ్మను చూపించి ఓట్లు కొల్లగొట్టాడు. పవన్ భజన పుణ్యమాని అధికారంలోకి వచ్చాడు. కానీ ఆ తర్వాత నుంచీ మాత్రం ఆంద్రప్రేదేశ్‌కి ఇచ్చిన హామీలు, మోడీ నుంచి తీసుకొస్తానన్న హామీలనన్నింటినీ గాలికొదిలేసి రాజకీయంగా ఎదగాలనుకున్నాడు. ముందుగా తెలంగాణా ప్రభుత్వాన్ని పడగొట్టి అక్కడ అధికారంలోకి రావాలనుకున్నాడు, కానీ కెసీఆర్ కొట్టిన దిబ్బతో గింగిరాలు తిరిగిపడ్డాడు. ఇక అక్కడి నుంచీ బాబు పిలకను చేతుల్లోకి తీసుకున్న కెసీఆర్, మోడీలు బాబును ఒక ఆట ఆడిస్తున్నారు. ఆంద్రప్రదేశ్‌కి రావాల్సిన ప్రయోజనాలన్నింటినీ కోల్పోతూ ఉన్నా బాబుకు మాట్లాడే ధైర్యం లేకుండా పోయింది.

రాజకీయ వ్యూహాలు, కుట్రలు పన్నడంలో సిద్ధహస్తుడైన బాబు గుజరాత్ ఎన్నికల సందర్భంగా కూడా మోడీని దెబ్బకొట్టడానికి ఒక వ్యూహం రచించాడు. హైదరాబాద్ బేస్డ్ న్యూస్ ఛానల్……. బాబు భజన మీడియాలో ప్రధాన ఛానల్‌కి గుజరాత్‌ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ ద్వారా గుజరాత్‌లో ఉండే గ్రామీణ ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. 2014లో ఆంద్రప్రదేశ్‌లో ఆడిన గేం ఆడారు. అయితే ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మోడీకి చేరవేయడంతో మోడీ బాబుకు దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చాడు.

ఇక తాజాగా జరిగిన గుజరాత్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఎన్డీఏ ముఖ్యమంత్రులందరినీ ఆహ్వానించిన మోడీ బాబును మాత్రం పక్కనపెట్టేశాడు. మామూలుగా అయితే బాబు ఎక్కడికెళ్ళినా అక్కడంతా బాబుదే హవా అన్నట్టుగా ప్రచారం చేసే పచ్చ మీడియా కూడా ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయి కూర్చుంది. బాబుకు ఆహ్వానం కూడా పంపకుండా మోడీ అవమానించిన విషయాన్ని కనీసం చెప్పడానికి కూడా సిగ్గుపడుతోంది. మరి ఇప్పటికైనా బాబు ధైర్యం చేయగలడా? కేసులు ఉన్నంత వరకూ బాబు అంత సీన్ ఉంటుందా? ఏం చేసినా తెరవెనుకనే చేయాలి…..కానీ బాబు బ్యాడ్‌లక్…… అక్కడున్నది ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కాదు……. బాబునే తలదన్నే స్థాయి వ్యూహాలు పన్నగల కెసీఆర్, మోడీలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -