నంద్యాల ఉప ఎన్నికలో తమ అభ్యర్తి శిల్పామోహన్రెడ్డి తరుపున జగన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో జగన్ ముఖ్యంగా బాబు, ప్రభుత్వ పరిపాలనలను టార్గెట్ చేసి విమర్శల పర్వం గుప్పిస్తున్నారు. సాదారనంగా అఖిలపై విమర్శలు గుప్పిస్తారని అందరూ అనుకున్న దానికి భిన్నంగా జగన్ వ్యవహరించారు. ఇదే ఇప్పుడ సోషియల్ మీడియాలో, నాయకుల్లో వైరల్గా మారింది.
ప్రచారంలో అఖిల పేరును ఒక్కసారికూడా పలకలేదు. తన పేరు ప్రస్తావించనందుకు తన సన్నిహితుల వద్ద అఖిల బాధపడినట్లు తెలుస్తోంది. అఖిలను ఎక్కడ విమర్శించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ప్రధానంగా చంద్రబాబు ఇచ్చిన హామీలులమీదనె జగన్ ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
జగన్ రైతు నగరం, కానాల, కొట్టాల, జూలపల్లె, పసురుపాడు, తేళ్లపాడు తదితర గ్రామాల్లో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. టిడిపి ఎమ్మెల్యేలు గెలిచిన 102 నియోజకవర్గాల్లో గానీ, మంత్రుల ప్రలోభాలతో ఆ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోగానీ అభివృద్ధి జరగడం లేదన్నారు.