వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వాయిస్ ఇప్పుడు ఎక్కడా వినిపించడంలేదు. దాంతో అనేక ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అడపాదడపా అధికార పార్టీ, సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసే రోజా హటాత్తుగా సైలెంట్ అయ్యారు. అయితె దీని వెనుక ఎవరున్నారె వార్తలు ఇప్పుడు అందరి మదిని తొలచివేస్తోంది.
రోజా ఇలా సైలెంట్ అయిపోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమెను సైలెంట్గా ఉండమన్నారా? అనే సందేహం కలుగుతోంది..రోజాపై ఎన్ని విమర్శలు వచ్చినా ఎప్పుడూ జగన్ సపోర్ట్ చేసెవాడు. కాని ఇప్పుడు అందరి చూపు జైగన్వైపె మల్లుతోంది.
ఎన్నికలలో వ్యతిరేక ఫలితాలు రావడానికి రోజా చేసిన వ్యాఖ్యలే కారణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రచారం సందర్భంగా అభ్యంతరకర పదజాలాన్ని వాడటమే కాకుండా, మంత్రి అఖిలప్రియ చుడీదార్లపై ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీకి ఓట్లను దూరం చేశాయనే భావన పార్టీ నేతల్లో ఉందట.
కొంత కాలం పాటు సైలెంట్గా ఉండాలంటూ పార్టీ అధిష్టానం రోజాకు సూచించినట్లు సమాచారం. దీంతో రోజా ప్రస్తుతం తన నియోజకవర్గం నగరిపైనే దృష్టి సారిస్తున్నారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలు, ప్రజల మధ్య గడుపుతున్నారు.