- Advertisement -
వైసీపీకీ రాజీనామా చేసిన వంగవీటి రాధ జగన్పై చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చింది వైసీపీ. రాధ అమాయకుడని బాబు మాటలు నమ్మి టీడీపీలోకి వెల్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీనేత పేర్ని నాని. రంగా విగ్రహావిష్కరణకు వెల్లడానికి జగన్ ఏనాడు అభ్యంతరం చెప్పలేదన్నారు. రాధను జగన్ తమ్ముడులాగా చూసుకున్నారని ఇప్పుడు ఆరోపనలు చేయడం మంచిది కాదన్నారు.
రంగా హత్యతో టీడీపీకీ సంబంధంలేదని చెప్పడం సరికాదన్నారు. మారు మూల ప్రాంతాల్లో ఎవరిని అడిగినా రంగాను చంపించింది టీడీపీనేతలేననే విషయం చెప్తారన్నారు. రాధకు పార్టీ సరైన గౌరవం ఇచ్చిందన్నారు. ఆయన కోరిక మేరకే దేవినేని నెహ్రూను పార్టీలోకి చేర్చుకోలేదన్నారు. చంద్రబాబు ట్రాప్లో పడొద్దని రాధాకు పేర్నినాని సూచించారు.