ఎన్నికల సమయంలో నోరు చాలా అదుపులో పెట్టుకోవాలి. మాట్లాడే ప్రతి మాట చాలా జాగత్రగా మాట్లాడాలి. ఎందుకంటే పొరపాటును ఏదైన తప్పుగా మాట్లాడితే ఆ వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. తాజాగా ఇటువంటి సంఘటనే ఒకటి జరిగింది. తమ పార్టీకి ఓటేయని చెప్పడానికి బదులు తమ ప్రత్యర్థి పార్టీకి ఓటేయని చెప్పి నాలుక్కరుచుకున్నారు వైసీపీ నేత. పూర్తి వివరాల్లోకి వెళ్తే… వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి పార్టీ ప్రచారంలో భాగంగా విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన, పొరపాటున సైకిల్ గుర్తుకు ఓటేయాలని పేర్కొన్నారు.
గౌతమ్ రెడ్డి మాటలకు కంగుతిన్న పార్టీ నేతలు వెంటనే గౌతమ్ రెడ్డిని అప్రమత్తం చేయడంతో, చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు గౌతమ్ రెడ్డి. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. గౌతమ్ రెడ్డి గతంలో కూడా అనేకసార్లు పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడారు. వంగవీటి రంగపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జగన్. తరువాత కొద్ది కాలానికి మళ్లీ పార్టీలో చేర్చుకున్నారు. పార్టీలో చేరిన తరువాత ముస్లీం మహిళల గురించి కూడా వివాస్పవ వ్యాఖ్యలు చేసి వార్తలు నిలిచారు గౌతమ్ రెడ్డి.