- Advertisement -
వైసీపీ మహిళా ఎమ్మెల్యే మంత్రి సోమిరెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇచ్చాపురంలో జరిగిన పాదయాత్ర ముగింపు సభకు జనాలు రాలేదని మంత్రి చేసినవ్యాఖ్యపై మండిపడ్డారు. పఐదు సార్లు ఓడిపోయిన నువ్వు మంత్రి పదవి తీసుకోవడం సిగ్గులేదాని ప్రశ్నించారు. ఇచ్చాపురం సభకు నువ్వు వచ్చింటే..జనాలు తొక్కి పడేసె వారని రోజా ధ్వజమెత్తారు.
ఉదయం తిరుమళ వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు రోజా. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, చంద్రబాబు పాలనను ఎండగట్టడానికి మరో ప్రస్థానంలా ప్రజా సంకల్ప పాదయాత్ర సాగిందని అన్నారు. ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా పూర్తిచేసుకున్న వైఎస్ జగన్ నేడు స్వామివారి దర్శనం కోసం తిరుమల వస్తున్నారని తెలిపారు. మరోవైపు తిరుపతికి వస్తున్న జననేతకు ఘన స్వాగతం పలికేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు