ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ ప్రజలపై వేసిన ముద్ర అంతా ఇంతా కాదు..ఇప్పటికి అయన ను ప్రజలు మర్చిపోలేదంటే అది అయన ప్రజలకోసం చేసిన సేవ అలాంటిది.. విద్య వైద్య రంగాల్లో అయన చేసిన సేవకి , ప్రజలకోసం చేసిన మేలు కి ఆయనకు ప్రజలు తమ గుండెల్లో గుడి కట్టారని చెప్పొచ్చు.. ఎంత వత్తిడి లో ఉన్నా ఎలా నెగ్గాలో జగన్ నుంచి అందరు నేర్చుకోవాల్సిన విషయం. ఓ ఎనిమిది సంవత్సరాల ముందు జగన్ పరిస్థితి ఎలా ఉన్నది అనేది అందరికి తెలిసిందే.. ఓ వైపు తండ్రి మరణం, మరి వైపు కేసులు, ఇంకో వైపు అప్పుడే పుట్టిన పార్టీ భాధ్యతలు ఇవన్ని జగన్ కి ఒకేసారి ముంచుకు రావడంతో అయన ఎలా తట్టుకుని నిలబడతారో అని అందరు అనుకున్నారు.. కానీ జగన్ వాటిని అధిగమించి ఇప్పుడు ముఖ్యమంత్రి గా ఎదిగారు.. తనపై వచ్చిన ఆరోపణలను ప్రజలకు నిరూపిస్తే చాలు అని ప్రజల్లోకి వెళ్లి మరీ తనని తాను కాపాడుతున్నాడు..
ఇక జగన్ పై ఎల్లో మీడియా చేసిన పోరాటం ఛానల్ మీద చేస్తే ఈ పాటికి నేషనల్ లెవెల్లో ఆ ఛానల్ డెవలప్ అయ్యేది.. తాజగా జగన్ విషయంలో ఆ మీడియా చేసిన అకృత్యాలు ఒక్కోటి బయటకి వస్తున్నాయి.. ఒక్క లేఖ ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తోంది. న్యాయవ్యవస్థలో సంచలనంగా మారింది. రాజకీయాంగానూ హీటు రాజేస్తోంది. ప్రధానంగా పచ్చ మీడియాకి పచ్చి వెలక్కాయలా మారింది. కక్కాలేక మింగలేక అన్నట్టుగా తయారయ్యింది. ఏం చేయాలో పాలుపోని స్థితికి చేర్చింది. చివరకు ప్రభుత్వం తమకు ప్రకటనలు ఇవ్వడం లేదని నానా యాగీ చేసే మీడియాలోనే ప్రభుత్వ ప్రెస్ మీట్ కి సింగిల్ కాలమ్ చోటు కూడా దక్కలేదు. దాంతో ఏపీలో మీడియా వ్యవహారం బాహటంగా బయటపడింది. ఎవరి ప్రయోజనాల కోసం పచ్చ బ్యాచ్ పనిచేస్తుందన్నది ప్రస్ఫుటం అయ్యింది.
వివరాలికి వెళితే ప్రభుత్వం సుప్రీం కోర్టు కు ఇటీవలే ఓ లేఖ రాసింది. ఇందులో చంద్రబాబు అఘాయిత్యాలు అన్ని రాసింది. అయితే అమరావతి విషయంలో విచారణ చేయొద్దు అని తీర్పు పై ఇప్పుడు కొంత వివాదం నెలకొంటుంది. అయితే దీన్ని దేశంలోని అన్ని పార్టీ లు సమర్ధించగా మన రాష్ట్రంలోని కొన్ని పచ్చ మీడియా సంస్థలు సముఖత చూపేలడు. దాంతో ప్రజలు ఇప్పుడు మీడియా స్వేఛ్ఛ అంటూ కొండంత రాగం తీసే ఆయా పత్రికల యజమానులపై తీవ్రంగా మండిపడుతున్నారు.
జేసి ని టార్గెట్ చేశారా.. టీడీపీ కి మళ్ళీ మొదలైందిగా..?
విజయ సాయి రెడ్డి పై అందరు వ్యతిరేకం అవుతున్నారేంటి..?