Monday, May 20, 2024
- Advertisement -

ఆలూలేదు సూలూ లేదు…కొడుకు పేరు సోమ‌లింగ‌మ‌ట‌…అట్లా ఉంది జ‌గ‌న్ ప‌రిస్థితి…

- Advertisement -

ఏపీలో వైసీపీకి ప‌రిస్థితు అనుకూలించ‌ట్లేదు. పార్టీలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను కూడా జ‌గ‌న్ కాపాడుకోలేక‌పోతున్నాడ‌నె వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. అయితె ఇప్పుడు తాజాగా పార్టీలో మంత్రి ప‌ద‌వులు ఎవ‌రిక‌నె వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వ‌చ్చే సార్వ‌త్రి ఎన్నిక‌ల్లో గెలిచి సీఎం అయిపోతాన‌ని, నీకు ఈ శాఖ‌, ఆయ‌న‌కు ఆ శాఖ ఇచ్చేస్తాన‌ని పార్టీలో మిగిలిన వాళ్ల‌కు తెగ హామీల మీద హామీలు గుప్పించేస్తున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

అయితె దీని వెనుక అస‌లు కార‌ణాలు వేరే ఉన్నాయ‌నె గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పార్టీ నుంచి వెళ్లిపోతోన్న వారిలో న‌మ్మ‌కం క‌లిగించ‌డానికి జ‌గ‌న్ వేసిన ఎత్తు ఒక‌టి అయితే వారితో ఇప్ప‌టి నుంచే పార్టీ కోసం భారీగా ఖ‌ర్చు పెట్టించేందుకు వేసిన మ‌రో ఎత్తుగా కూడా తెలుస్తోంది. పార్టీ ఖ‌ర్చులు త‌డిసి మెపెడు అవుతున్నాయ్‌… భ‌రించ‌లేం బాబోయ్ అని వైసీపీ ఎమ్మెల్యేలు, నాయ‌కులు మొత్తుకుంటున్నా పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ఈ శాఖ నీదేగా ఓ సైటో లేదా ఏదో ఒక స్థిరాస్తో అమ్మేయ్ అని జ‌గ‌న్ చెపుతున్నాడ‌ట‌.

ప్ర‌స్తుతం వైసీపీ వైఎస్సార్‌కుటుంబం, న‌వ‌రత్నాల కంటే జ‌గ‌న్ పార్టీ నాయకుల‌కు ఇస్తోన్న బంప‌ర్ ఆఫ‌ర్లే పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీ నాయ‌కులు ఇంట‌ర్న‌ల్ చ‌ర్చ‌ల్లో జ‌గ‌న్ ఎవ‌రికి ఏ మంత్రిత్వ శాఖ‌పై హామీ ఇచ్చాడో లీక్ అయ్యింద‌ట‌. ఇప్ప‌టికె పార్టీ సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంటె ఈ ప‌ద‌వులు పందేరం ఏంట‌ని నాయ‌కులు వాపోతున్నారు.ప్ర‌స్తుతం ఏ ఇద్ద‌రు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు క‌లుసుకున్నా ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది.

జ‌గ‌న్ తెలివిగా పార్టీ నాయ‌కులు ఎవ్వ‌రూ టీడీపీ వైపు చూడ‌కుండా ఉండ‌డంతో పాటు వారితో బాగా ఖ‌ర్చు పెట్టించేందుకే ఇలా హామీల మీద హామీలు గుప్పిస్తున్నాడ‌న్న‌ది వైసీపీ వాళ్ల‌కు తెలిసిపోయింద‌ట‌. అయితే వైసీపీ వాళ్ల‌లో చాలా మంది జ‌గ‌న్ మాట న‌మ్మే ప‌రిస్థితుల్లో లేరు. గ‌త ఎన్నిక‌ల్లో కూడా గ్యారెంటీగా గెలుస్తామ‌న్న ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్లి బొక్క బోర్లా ప‌డిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఇలాంటి ప‌రిస్థితితుల్లో జ‌గ‌న్ నాయ‌కుల‌కు ఎలాంటి న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -