Saturday, May 4, 2024
- Advertisement -

గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌సిన వైఎస్ జ‌గ‌న్ : బాబు సీఎం కావ‌డమే మ‌న ఖ‌ర్మ‌..

- Advertisement -

తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌శింహ‌న్‌ను ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ క‌లిశారు. రాష్ట్రంలో వైసీపీ సానుభూతి ప‌రుల ఓట్లు తొల‌గించ‌డంతోపాటు ల‌క్ష‌ల సంఖ్య‌లో దొంగ ఓట్లు ఉన్నాయంటూఈ సమావేశంలో భాగంగా ఏపీలో వైసీపీ మద్దతుదారుల ఓట్లను అక్రమంగా తొలగించడంతో పాటు బోగస్ ఓట్లపై జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేశామ‌న్నారు. అలాగే పోలీస్ అధికారుల నియామకాల్లోనూ అధికార దుర్వినియోగం బాబు ఎలా చేస్తున్నారో వివ‌రించామ‌న్నారు.పై బాబు పోలీస్ వ్య‌వ‌స్థ‌ను త‌న స్వార్థానికి ఉప‌యోగించుకుంటున్నా. స‌ర్వేల పేరేతో త‌మ పార్టీ సానుభూతి ప‌రుల ఓట్ల‌ను అన్యాయంగా తొల‌గిస్తున్నార‌న్నారు.

ప్ర‌త్యేక హోదా కోసం బాబు చేస్తున్న దీక్ష‌పై కూడా సెటైర్లు వేశారు. ఒక మ‌నిషిని తానే క‌త్తితో పొడిచి దానికి వ్య‌తిరేకంగా దీక్ష చేస్తే ఎలా ఉంటాదో ప్ర‌త్యేక‌హోదా కోసం బాబు చేస్తున్న దీక్ష‌కూడా అలాంటిదేన‌న్నాను. ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించిన‌ప్పుడు అసెంబ్లీలో అరుణ్ జైట్లీని ఎలా పొగిడారో అంద‌రికి తెలుసున‌న్నారు. హోదా ఉన్న రాష్ట్రాలు ఏ సాధించాయాని బాబే ప్ర‌శ్నించార‌న్నారు. భాజాపాతో క‌ల‌సి ఉన్న‌ప్పుడు టీడీపీ మంత్రులు ప్యాకేజీకోసం అర్థిక మంత్ర అరుణ్ జైట్లీ చుట్టూ ఎన్ని సార్లు ప్ర‌ద‌క్షిణ‌లు చేశారో అంద‌రికి తెలుసున‌న్నారు. బాబు సీఎం కావ‌డ‌మే మ‌న ఖ‌ర్మ‌ని జ‌గ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌త్యేక హోదాను నీరు గారుస్తూ మాట్లాడిన మాట‌లు ఎవ‌రూ మ‌ర‌చిపోర‌న్నారు. భాజాపాతో నాలుగు సంవ‌త్స‌రాలు సంసారం చేసిన‌ప్పుడు ప్ర‌త్యేక హోదా అడ‌గ‌కుండా దాన్ని కూని చేశార‌న్నారు. నాలుగేల్ల త‌ర్వాత యూట‌ర్న్ చేసుకొని న‌ల్ల‌చొక్కావేసుకొని హోదాకోసం ధ‌ర్మ‌పోరాటం చేస్తుంటే ద‌య్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లు ఉంద‌ని సెటైర్ వేశారు జ‌గ‌న్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -