బీసీలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరును జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య తాజాగా బయట పెట్టారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. బీసీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పుకునే చంద్రబాబు నాయుడు బీసీ న్యాయవాదులను జడ్జిలు కాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని జగన్ ప్రశ్నించారు.
బీసీ న్యాయ మూర్తుల నియామకాలను అడ్డుకునే విధంగా తప్పుడు ఫీడ్బ్యాక్ ఎందుకు ఇస్తున్నారని జగన్ నిలదీశారు. గతంలో హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం ఇద్దరు బీసీల పేర్లు తెరపైకి రాగా వారిపై పలు ఆరోపణలు చేస్తూ గతేడాది మార్చి 21న చంద్రబాబు.. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్కు తప్పుడు నివేదిక పంపించారని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఈశ్వరయ్య అన్నారు
నోరు తెరిస్తే బీసీల సంక్షేమం అనే చంద్రబాబు ఎందుకు బీసీ న్యాయవాదులను జడ్జిలు కాకుండా అడ్డుకుంటున్నారు? వారి నియామకాలను అడ్డుకునేలా తప్పుడు ఫీడ్బ్యాక్ ఎందుకు ఇస్తున్నారు?’ అని ట్విటర్లో వైఎస్ జగన్ ప్రశ్నించారు.
Recent disclosures by Justice Eswaraiah have exposed Naidu’s so-called ‘sincerity’ towards BCs. @ncbn, you claim to accord priority to BC welfare, then why did you oppose the appointment of BC advocates as Judges? Why did you provide false feedback to prevent their appointment?
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 26, 2018