డ్వాక్రా మహిళలకు వైఎస్ జగన్ మోహన్రెడ్డి బంఫర్ ఆఫర్ ప్రటించారు. వైసీపీ అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కడపలో జరుగుతున్న సమరశంఖారావంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు.
తమ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లకు పంపితే సంవత్సరానికి రూ. 15000 ఇస్తానని ప్రకటించారు. ప్రతి మే నెలలో రైతులకు రూ. 12,500 ఇస్తామని హామీ ఇచ్చారు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 75 వేల రూపాయలు ఇస్తామన్నారు. ప్రతి అవ్వ, తాతకు పింఛన్ రూ.3వేలకు పెంచుతామన్నారు. ఇల్లులేని ప్రతి ఒక్కరికి అధికారంలోకి రాగానే ఇళ్లు కట్టిస్తామన్నారు. గ్రామంలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేస్తానని ..దాని ద్వారా రేషన్ సరుకులు ఇంటికే డెలవరీ చేసే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు.
గత ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకోకపోవడం వల్ల వారిపై రూ.25,000 కోట్ల భారం పడిందన్నారు.డ్వాక్రా సంఘాలకు ఎన్నికలకు వరకు ఉన్న రుణాలు.. నాలుగు దఫాలుగా మాఫీ చేస్తామన్నారు. ఆ డబ్బును నేరుగా మహిళల చేతికే అందజేస్తామన్నారు.