తన సతీమణి వైఎస్ భారతిపై ఎల్లో మీడియా అల్లిన కథనాలపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య వాదులకు జగన్ బహిరంగ లేఖ రాశారు.
జడ్జీగారు పరిగణనలోకి తీసుకున్న తరవాతే చార్జిషీట్ లో ఏముంంది అన్న విషయం మాకైనా, ఎవరికైనా తెలుస్తుంది. అలాంటిది జడ్జీగారు పరిగణనలోకి తీసుకోకముందే.. మాకే తెలియకుండా, ఈ విషయం నేరుగా ఈడీ నుంచి కొన్ని పత్రికలకు ఎలా తెలిసింది? ఎవరు వారికి చెప్పారు? మా మీదే బురద చల్లాల్సిన అవసరం ఎవరికి ఉంది? .. కొన్ని అంశాలను రాష్ట్ర ప్రజలందరి ముందు ఉంచటం మంచిదన్న అభిప్రాయంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను’ అని జగన్ తన లేఖను కొనసాగించారు.
రాష్ట్ర ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు @ysjagan బహిరంగ లేఖ pic.twitter.com/CInXiRwVwq
— YSR Congress Party (@YSRCParty) August 10, 2018