Tuesday, May 14, 2024
- Advertisement -

బ్రాహ్మణి వర్సెస్ భారతి?

- Advertisement -

ఇప్పటివరకు రాజకీయాల్లో పోరు చంద్రబాబు – జగన్ మధ్య జరుగగా తాజాగా నారా, నందమూరి కోడళ్ల మధ్య సమరం జరగనుందా అంటే అవుననే సమాధానం వినిపస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. టీడీపీకి స్టార్ క్యాంపెయినర్లుగా మారారు నారా బ్రాహ్మణి, భువనేశ్వరి. వీరిలో బ్రాహ్మణి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేయడమే కాదు అసెంబ్లీ లేదా ఎంపీ స్ధానానికి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు సీఎం జగన్ భార్య భారతి సైతం ఎన్నికల బరిలో దిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి భారతి 2019 ఎన్నికల్లోనే పోటీచేస్తారని ప్రచారం జరిగింది. కానీ అనుకోని కారణల వల్ల ఆమె పోటీ చేయలేదు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత సింపతిని క్యాచ్ చేసుకునేందుకు బాబు కుటుంబ సభ్యులను రంగంలోకి దింపింది టీడీపీ. మహిళా సెంటిమెంట్ కలిసి వస్తుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రాహ్మణికి పోటీకి భారతిని రంగంలోకి దించేందుకు సిద్ధమైంది వైసీపీ.

అవినీతి కేసుల్లో ఇప్పటికే చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తుండగా త్వరలో నారా లోకేష్‌ కూడా అరెస్ట్‌ కావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మణి నాయకత్వం వహించనున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇప్పటికే రాజమండ్రి టీడీపీ క్యాంపు నుండి నేతలను గైడ్ చేస్తున్నారు బ్రాహ్మణి. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి భారతి, టీడీపీ నుంచి బ్రాహ్మణి బరిలోకి దిగుతున్నారనే వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే వీరిద్దరూ ఒకరిపై ఒకరు పోటీచేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -