Sunday, May 5, 2024
- Advertisement -

పొర‌పాటున బాబుకు ఓటేస్తే…..? జ‌గ‌న్‌

- Advertisement -

ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబుపై వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పొర‌పాటున బాబుకు ఓటు వేస్తె రాష్ట్రంలో ఏవి మిగ‌ల‌వ‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఇసుక‌లారీ రేటు రూ.40,000 ప‌లుకుతోంద‌ని బాబు మ‌రో సారి అధికారంలోకి వ‌స్తే ల‌క్ష‌రూపాయ‌ల‌కు ప‌లుకుతుంద‌ని విమ‌ర్శ‌లు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన బహిరంగ స‌భ‌లో జ‌గ‌న్ ఈవ్యాఖ్య‌లు చేశారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు.

పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోట వాణి‌‌, కాకినాడ లోక్‌సభ అభ్యర్థి వంగా గీతలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్ర‌జ‌ల‌కు పిలుపు నిచ్చారు. పాద‌యాత్ర‌లో అంద‌రి క‌ష్టాలు తెలుసుకున్నాన్నారు. ఉత్తరప్రదేశ్‌లో టన్ను చెరుకు రూ.3115 ఉంటే.. ఇక్కడ రూ.2600కు మించి ఇవ్వడం లేదని రైతులు చెప్పారు.

బాబు ఈ ఐదేల్ల పాల‌న‌లో 6000 పాఠ‌శాల‌లు మూత‌ప‌డ్డాయ‌ని బాబుకు ఓటు వేస్తె ఒక్క పాఠ‌శాల కూడా ఉండ‌ద‌న్నారు. నారాయణ స్కూల్‌లో ఎల్‌కేజీ చదవాలన్నా రూ.25 వేలు ఉంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ ఫీజు రూ. లక్ష చేస్తారు. ఆర్టీసీ, కరెంట్‌ కూడా మిగల్చడు.. అన్నీ ప్రయివేట్‌ పరం చేస్తాడు. కరెంట్‌, ఆర్టీసీ, పెట్రోల్‌ సహా అన్నీ చార్జీలు పెంచేస్తాడంటూ విమ‌ర్శ‌లు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -