Thursday, May 16, 2024
- Advertisement -

చిత్తూరు వైసీపీ ఎంపీ రేసులో మాజీ వైస్‌ఛాన్స‌ల‌ర్‌..

- Advertisement -

దేశవ్యాప్తంగా మరో ఏడాదిలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఏపీలో అన్ని పార్టీలు ఎన్నిక‌లు సిద్ద‌మ‌వుతున్నాయి. జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్రలో అసెంబ్లీ సెగ్మెంట్ల‌కు పార్టీ త‌రుపున అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించారు. ఇక ఎంపీ స్థానాల‌పై కూడా దృష్టిసారించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్తగా రాజకీయాలలోకి వచ్చేవాళ్ళు, పార్టీ మారే జంప్ జిలానీలు ఎక్కువయిపోయారు.

జ‌గ‌న్ గుంటూరు పార్ల‌మెంట్ స్థానానికి పార్టీ త‌రుపున లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌ను ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల నాటికి పార్టీలోకి మార్పులు, చేర్పులు ఉంటాయ‌న‌డంలో సందేహంలేదు. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు వ‌స్తున్న స్పంద‌న‌ను చూసి వైసీపీ గూటికి చేరుకుంటున్నారు నాయ‌కులు.

కొత్తగా పార్టీ లోకి చేరేవారు కూడా తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు జ‌గ‌న్‌. ద్రావిడ యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ రత్తయ్య త్వరలో వైసీపీ పార్టీ లో చేర‌బోతున్న‌ట్లు చెప్పారు. చిత్తూరు ఎంపీ స‌ర్వేలో వైసీపీ త‌రుపున ఆయ‌న పేరు ఖ‌రార‌య్యే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి బ‌లం చేకూర్చే విధంగా ఎస్‌ఆర్‌ పురం మండలంలోని మంగుంట శ్రీలక్ష్మినరసింహ స్వామి దర్శనం అనంతరం మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు ఎంపీ సీటు తాను ఆశిస్తున్నట్టు అయన చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -