Tuesday, May 21, 2024
- Advertisement -

విజయసాయితో జ్యోతుల మీటింగ్…… జ్యోతుల ఇంటిపై ఐటి రెయిడ్స్ చేయించిన బాబు

- Advertisement -

రాష్ట్రంలో జరుగుతున్న అన్ని దారుణాలను, అక్రమాలను వైకాపాకు, జగన్‌కి ఎలా అంటగట్టాలా అని ఆలోచించడంలోనే చంద్రబాబు పదవీ కాలం కాస్తా గడిచిపోయేలా ఉంది. హోదాతో సహా ఏ ఒక్క ప్రయోజనాన్ని రాష్ట్రానికి ఇవ్వని బిజెపితో నాలుగేళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసం సావాసం చేసిన చంద్రబాబు ఇప్పుడు బిజెపి పాపాలన్నింటినీ జగన్ ఖాతాలో వేయడంలో బిజీగా ఉన్నాడు. మరోవైపు వైకాపాలోకి వరుసగా చేరుతున్న నాయకులను ఆపడానికి కూడా శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు చంద్రబాబు.

వైకాపా నుంచి టిడిపిలో చేరిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుమారుడికి జగన్ అంటే అంతులేని అభిమానం. అందుకే 2019 ఎన్నికల సమయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వైకాపాలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. టిడిపిలో చేరుతున్న సందర్భంలో ఇచ్చిన ఏ ఒక్క మాటా నిలబెట్టుకోని చంద్రబాబు నైజం తెలుసుకున్న జ్యోతుల నెహ్రూ కూడా ఇప్పుడు రీ ఎంట్రీకి సుముఖంగానే ఉన్నారు. రీసెంట్‌గా జ్యోతుల నెహ్రూతో కలిసి ఆయన కుమారుడు విజయసాయిని కలిశారన్న వార్తలు గోదావరి జిల్లా టిడిపి నాయకుల చర్చల్లో వినిపిస్తున్నాయి. జ్యోతుల కూడా ఆ వార్తలను ఖండించలేదు. ఇప్పుడు ఈ విషయమే చంద్రబాబుకు కోపం తెప్పించింది. జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఐటి రెయిడ్స్ జరిగేలా చేసింది. జ్యోతుల నెహ్రూ స్వగ్రామం ఇర్రిపాకలో ఉన్న ఆయన నివాసంలో విశాఖ ఐటి అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయమై గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్ అయింది. ఐటి రెయిడ్స్ తర్వాత చంద్రబాబుకు జ్యోతుల నెహ్రూ సరెండర్ అవుతాడా? లేక చంద్రబాబు ద్రోహానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని వైకాపాలో చేరతాడా అన్న విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం పరిణామాల విషయంలో మాత్రం జ్యోతుల నెహ్రూ అనుచరులు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -