Friday, May 3, 2024
- Advertisement -

రోజా నోటి దురుసు త‌గ్గించుకుంటె వైసీపీకి ప్ల‌స్ అవుతుంది…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారంలో రెండు పార్టీలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్ట‌కుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై విమ‌ర్శ‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నారు. వైసీపీ ఎంఎల్ఏ రోజా గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నోటికి ఏది వ‌స్తె అది అనేస్తుంది. అయితే ఆనోటి దూలె పార్టీకి చేటు తెస్తున్నారు.

రోజా వాగ్థాటిని అందరూ మెచ్చుకోవాల్సిందే. ఆమెను తట్టుకోలేకే అసెంబ్లీ నుండి టిడిపి ఏడాదిపాటు సస్పెండ్ చేసిందన్న విషయం అందరికీ తెలిసిందే. రోజా మాటల వల్ల లాభాన్ని పక్కన బెడితే నష్టం ఎక్కువన్న విషయం చాలా సార్లు స్పష్టమైంది. ఇప్పుడు తాజాగా నంద్యాల‌లో గ‌డిచిని రెండు రోజులుగా రోజా చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి.

అఖిల కట్టుబొట్టుపై రోజా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరకరమే. ఒక మహిళగా ఉండి మరో మహిళ కట్టుబొట్టును విమర్శించాల్సిన పనేలేదు. పైగా అఖిల ప్రియ డ్రస్ సెన్స్ ఎప్పుడూ అభ్యంతరకరంగా లేదన్న విషయం గమనించాలి. చీర కట్టుకుంటుందా? డ్రస్సులేసుకుంటుందా అన్నది పూర్తిగా అఖిల స్వంత విషయం.

సినిమాల్లో ఉన్నపుడు రోజా వేసిన డ్రస్సుల గురించి అందరికీ తెలిసిందే. తాజాగా టివి షోల పేరుతో రోజా వేస్తున్నస్టెప్పులు అభ్యంతరంగా ఉన్నాయి. అయినా వాటిని రోజా సమర్ధించుకుంటున్నారు. మరి తన విషయాన్ని సమర్ధించుకుంటున్న రోజా మంత్రి అఖిలను ఎలా తప్పుపడతారు? అఖిల విషయంలో రోజా చేసిన వ్యాఖ్యల కారణంగానే వైసీపీ అధ్యక్షుడు జగన్ సోదరి షర్మిల, భార్య వేసుకునే డ్రస్సులను నెటిజన్లు సోషల్ మీడియాలోకి లాగుతున్నారు.

ప్రత్యర్ధిని వ్యక్తిగతంగా దూషించటాన్ని ఎవరూ సమర్ధించరన్న విషయాన్ని రోజా గుర్తించాలి. విధానపరంగా ఎంత విమర్శించినా ఎవరూ అభ్యంతరాలు చెప్పరు. జనాల్లో రోజా అంటే ఓ క్రేజుంది. దాన్ని తన నోటి దూలతో చెడగొట్టుకో కూడదన్న విషయాన్ని రోజా ఎంత తొందరగా గ్రహిస్తే వైసీపీకి అంత ప్లస్ అవుతుంది. లేకుంటె నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో రోజా నోటి దూల త‌గ్గించుకోక‌పోతె న‌ష్టం త‌ప్ప‌ద‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -