Saturday, May 18, 2024
- Advertisement -

సోమిరెడ్డి వ్యాఖ్య‌ల‌కు ఘాటు కౌంట‌ర్ ఇచ్చిన అంబ‌టి

- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వివాదంపై రెండు పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది. తిరుమ‌లలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై ర‌మ‌ణ‌దీక్షితులు చేస్తున్న ఆరోప‌న‌లు తెలిసిందే. ఆయ‌న చేసిన ఆరోప‌న‌ల‌పై టీడీపీ మంత్రి సోమిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ర‌మ‌ణ దీక్షుతుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది.

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. రమణ దీక్షుతులను బొక్కలో వేసి రెండు తగిలిస్తే సరిపోతుంది అని సోమిరెడ్డి వ్యాఖ్యనించడం నీచమైన చర్యగా అభివర్ణించారు. ఆయ‌న‌పై చేసిన వ్యాఖ్య‌లు సిగ్గుచేట‌న్నారు. ర‌మ‌ణ‌దీక్షితుల‌కు సోమిరెడ్డి వెంట‌నే క్ష‌మాప‌న చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ఎన్నికల్లో ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రబాబు దయా దాక్షిణ్యాల మీద మంత్రి అయిన సోమిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని టీడీపీ నేతలు ప్రవర్తించడం చట్టాలను ఉల్లంఘించడమేనని అన్నారు. రమణ దీక్షితులు, ఐవైఆర్‌ కృష్ణారావు లాంటి వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితున్నారని పోలీసులతో కేసులు పెట్టిస్తే సహించబోమని హచ్చరించారు. రమణ దీక్షితులపై సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -