టీడీపీ ఎంపీ సీతెలుగుదేశం నేత, పార్లమెంటు సభ్యుడు సీఎం రమేశ్పై నిప్పులు చెరిగారు వైసీపీ నేత అంబటి రాంబాబు. రమేష్ ఇంటిపై ఐటీ సోదాలు జరిగితే అధికార టీడీపీకి భయమెందుకని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నంబర్ వన్ బినామీ అని అంబటి రాంబాబు ఆరోపించారు.
ఐటీ దాడుల వెనుక ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఉన్నాడని రమేశ్ ఆరోపించడంపై ఆయన మండిపడ్డారు. జగన్ ను విమర్శించే నైతిక అర్హత రమేశ్ కు లేదని తేల్చిచెప్పారు. సీఎం రమేశ్ మీసం మెలేస్తే ఐటీ అధికారులు తొడలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.
రిత్విక్ సంస్థ ఎప్పుడైనా భారీ కాంట్రాక్టు చేసిందా అని ప్రశ్నించారు. ఆ సంస్థవన్నీ సబ్ కాంట్రాక్టులేనని, అవన్నీ బెదిరించి తీసుకున్నవేనని ఆరోపించారు. ఆయన జీవిత భాగస్వామికి, కుటుంబీకులకు తెలియకుండా వేలిముద్ర ఉంటేనే తెరుకునే లాకర్లు ఉండటమేంటని ప్రశ్నించారు.
సీఎం రమేశ్ ఓ గజదొంగ, బినామీ, బ్రోకర్ కాబట్టే అలాంటి లాకర్లు ఇంట్లో పెట్టుకున్నారని విమర్శించారు. ఇవన్ని చేస్తూ మీసం మెలేస్తున్నారని.. పచ్చకాలం అంటే ఇదేనని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీడీపీ నాలుగేళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు, తేడా ఎక్కడ వచ్చిందో విడిపోయారని విమర్శించారు.
సీఎం రమేశ్ సారా కాంట్రాక్టర్ దశ నుంచి పార్లమెంటు సభ్యుడి స్థాయికి రావడానికి గెస్ట్హౌస్ రాజకీయాలే కారణమని ఆరోపించారు. పచ్చకాలం ఎక్కువ కాలం ఉండదని, ప్రజలు బుద్ది చెప్పే రోజులు ముందున్నాయని అంబటి పేర్కొన్నారు.