Tuesday, May 7, 2024
- Advertisement -

గుడిని …గుడిలో లింగాన్ని మింగే ర‌కం బుద్ధావెంక‌న్న నైజం..

- Advertisement -

వైసీపీ, టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదురు తోంది.కొన్ని రోజుల‌గా వైసీపీ ఎమ్మెల్యే రోజాను టార్గెట్ చేస్తూ బుద్దావెంక‌న్న అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బుద్ధా వ్యాఖ్య‌ల‌పై వైసీపీ కూడా అదే రీతిలో కౌంట‌ర్ ఇస్తోంది.

తమ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నేత జోగి రమేశ్ మాట్లాడుతూ, ఓ మహిళా ఎమ్మెల్యేను అగౌరవ పరిచేలా వెంకన్న మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుడిని, గుడిలో లింగాన్ని మింగేసి రకం వెంకన్న అని, గుడిలో కొబ్బరి చిప్పలు దొంగిలించే చరిత్ర ఆయనదని విమర్శించారు. మహిళలను గౌరవించాలంటూ ర్యాలీలు నిర్వహిస్తున్న చంద్రబాబు తమ నాయకుల చేత రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -