Tuesday, May 14, 2024
- Advertisement -

మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టిన‌ రోజా

- Advertisement -

ఫైర్ బ్రాండ్ రోజా కనిపించడం లేదా.. వైఎస్ జగన్ సచివాలయంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి వైసీపీ ఎమ్మెల్యే రోజా హాజరుకాలేదు. నిన్నటి వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో కనిపించిన రోజా ఆ తర్వాత మంత్రుల జాబితాలో తనకు చోటు దక్కకపోవడంతో నిరాశ చెందారు. అందుకే ఈరోజు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

రోజాకు హోమంత్రి పదవి ఇస్తారని.. ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే జగన్ ప్రకటించిన జాబితాలో మాత్రం దక్కలేదు. అయితే మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయవాడలోనే రోజా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఆమె సీఎం గా జగన్ బాధ్యతల స్వీకరణకు, మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలోనూ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

కాగా చిత్తూరు జిల్లా నుంచి సీనియర్ , వైసీపీకి ఆర్థికంగా అండగా ఉన్న పెద్దిరెడ్డి రాంచంద్రరెడ్డికి జగన్ మంత్రి పదవి ఇచ్చారు. రెండో కోటాలో రోజాకు ఇస్తారని ఆశించారు. కానీ ఎస్సీ కోటాలో నారాయణ స్వామికి కేటాయించారు. రోజాకు మంత్రి పదవి దక్కకుండా పెద్దిరెడ్డియే చక్రం తిప్పారన్న టాక్ వినిపిస్తోంది.

అయితే అంతా ఊహించి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగినా.. జగన్ తన కేబినెట్ లో చోటు కల్పించకపోవడంతో రోజా మనస్తాపం చెందినట్టు సమాచారం. అందుకే మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగే సచివాలయ ప్రాంగణానికి ఆమె దూరంగా ఉన్నట్టు తెలిసింది.. హైదరాబాద్ వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -