Sunday, May 19, 2024
- Advertisement -

విశ్వ విఖ్యాత పప్పు సార్వభౌమ అంటూ లోకేష్‌పై స సెటైర్లు

- Advertisement -

మంత్రి నారాలోకేష్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సెటైర్లు వేశారు. విశ్వ విఖ్యాత పప్పు సార్వభౌమ అంటూ ఎద్దేవా చేశారు. ఆయనకు సూట్‌కేసు ఇస్తేనే పనులు జరుగుతాయని ఆరోపించారు. ఓటేసిన ప్రజలు ఆయన వద్దకు సమస్యలు చెప్పుకోవడానికి వెళితే పనులు జరగవని, పనుల కోసం డబ్బు ఇస్తేనే ఆయన సంతకాలు పెడతారని అన్నారు.

ఆనందనగరం సదస్సులు జరపడం సీఎం చంద్రబాబు శాడిజానికి పరాకాష్ట అని విమర్శించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయని, యువతకు జాబులు లేవని, రైతులు అప్పుల్లో మునిగిపోయారని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని, ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంద‌న్నారు. అందరూ సంతోషంగా ఉన్నారని చంద్రబాబు అనుకుంటే ఇప్పుడే ఎన్నికల్లోకి పదండి అని ఆమె సవాలు విసిరారు.

ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలతో రాజీనామా చేసి ఎన్నికల్లోకి రావాలని, అలాగే రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికల్లోకి దిగాలని రోజా అన్నారు. అసెంబ్లీ నియోజక వర్గాల పెంపు, ఓటుకు నోటు కేసు మాఫీ కోసమే కోసమే చంద్రబాబు 29 సార్లు ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -