రేపటి నుంచి అసెంబ్లీ సమావాశాలకు రెడీ అవుతోంది టీడీపీ. గతంలోసమావేశాలను వైసీపీ బహిష్కరించినప్పటి నుంచి అసెంబ్లీలో అధికారపక్షం, ప్రతిపక్షం రెండు పాత్రలను అధికార పార్టీ పోషిస్తోంది.రేపటి నుంచి ప్రారంభం కానున్న సమావేశాలే చివరివి కావడంతో ఈ సమావేశాలకైనా ప్రతిపక్ష పార్టీ హజరువుతుందని అందరూ భావించినా పాత పాటే పాడింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు లేఖ రాసిన సంగతి తెలిసిందే. కోడెల పంపిన లేఖకు ఘాటుగా నాలుగు పేజీల లేఖతో రిప్టై ఇచ్చారు వైసీపీ నేతలు. రేపటి నుంచి మీరు పెడుతున్న అసెంబ్లీ సమావేశాలకు మేం హాజరుకావటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజే మీ ఫిరాయింపు మంత్రులు నలుగురిని, ఫిరాయింపు ఎమ్మెల్యేలు 22 మందిని తక్షణం పదవుల నుంచి తొలగించాలని లేఖలో డిమాండ్ చేశారు.
కోట్ల రూపాయాలతో మా పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేసిందని, వారిపై వేటు వేయాలని ఎన్నిసార్లు లేఖలు ఇచ్చినా స్పీకర్ స్పందించలేదని అందులో పేర్కొన్నారు. ప్పటికైనా వారిని అనర్హులుగా ప్రకటించండి, రేపు సమావేశాలకు వస్తాం ఘాటుగా స్పందించారు.
స్పీకర్ తీరుపై కూడా వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీకు అంతగా అభిమానముంటే స్పీకర్ సీట్ నుంచి దిగిపోయి చంద్రబాబు కి పాలాభిషేకం చేసుకోవాలి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు. చంద్రబాబు నీకు, స్పీకరుకి బుద్ధి, జ్ఞానం, సిగ్గూ శరం ఉంటే జంపింగ్ ఎమ్మెల్యేలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని, కోడెల స్పీకర్ కుర్చికే కళంకం తెచ్చాడన్నారు. సీఎం ఫోటోకి పాలాభిషేకం చేసేంత హీనస్థితికి కోడెల దిగజారాడన్నారు మరో ఎమ్మెల్యే ఆర్కే.