Thursday, May 2, 2024
- Advertisement -

ఒన్ షాట్….. బాబు, వెంకయ్యలిద్దరినీ బుక్ చేసిన విజయసాయి

- Advertisement -

విజయసాయి వ్యూహాలు మామూలుగా ఉండడం లేదు. చంద్రబాబుతో సహా టిడిపి క్యాంప్ అందరికీ కూడా నిద్రలేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు వెంకయ్యనాయుడిని కూడా ఇరకాటంలో పెట్టేశాడు విజయసాయి. ‘నాయుడంటేనే నాయకుడు’ అని ఆ మధ్య ఒకసారి బహిరంగంగానే వ్యాఖ్యానించిన వెంకయ్యనాయుడు తన ప్రాధమ్యాలను ఎప్పుడూ దాచుకోలేదు. చంద్రబాబుతో వెంకయ్యనాయుడి సాన్నిహిత్యం తెలిసే వెంకయ్యను మోడీ లూప్‌లైన్‌లోకి నెట్టేశాడన్నది అందరికీ తెలిసిన విషయమే.

అయితే ఇప్పుడు వెంకయ్యనాయుడిని మరోసారి ఇరకాటంలో పెట్టేశాడు విజయసాయిరెడ్డి. సభ్యత, సంస్కారం, మానవత్వం అంటూ ఇతరుల విషయంలో సుద్దులు చెప్పే చంద్రబాబు తన దగ్గరకు వచ్చేసరికి అవేవీ అనుసరించాడు. ఒక రాజ్యసభ ఎంపినీ నేరగాడు అని అని సంబోధిస్తూ తన స్థాయిని బయటపెట్టుకున్నాడు చంద్రబాబు. ఇక ప్రధానమంత్రి కార్యాలయాన్ని నేరస్థుల అడ్డా అంటూ రెచ్చిపోయాడు బాబు. ఒక రోజు….ఒక సందర్భంలో కాకుండా వరుసగా చాలా సార్లు ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఈ వ్యాఖ్యలు కచ్చితంగా తప్పు అని సామాన్యులకు కూడా అర్థమవుతున్న విషయమే. ఇప్పుడు ఇదే విషయంపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకి అప్పీల్ చేశాడు విజయసాయి. ఈ విషయమే ఇప్పుడు వెంకయ్యనాయుడిని ఇరకాటంలో పెట్టేసింది. విజసాయి నోటీసులపై చర్యలు తీసుకోకపోతే నరేంద్రమోడీని అవమానించినట్టే అవుతుంది. చర్యలు తీసుకుంటే మాత్రం చంద్రబాబును ఇరకాటంలో పెట్టినట్టు అవుతుంది. మాటల మరాఠి అని అందరూ చెప్పుకునే వెంకయ్యనాయుడు ఈ సంకట స్థితి నుంచి ఎలా బయటపడతారో……..చంద్రబాబుని ఎలా బయటపడేస్తారో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -