ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. 2050 వరకు ఎలక్సన్లు అవసరంలేదని బాబు జీవో తీసుకొచ్చినా ఆశ్చర్యంలేదన్నారు. చంద్రబాబు నాయుడు పొంతన లేకుండా పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.
మానసిక రోగాలన్నీ బాబుపై ఒకే సారి దాడి చేసినట్లు ఉన్నాయని ఎద్దేవ చేశారు. చంద్రబాబు మానసికంగా బ్యాలెన్స్ కోల్పోయారనీ, ఎవరైనా ఆయన్ను వైద్యులకు చూపించాలని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఓవైపు కేంద్రం పరిధిలోని స్థలంలో జగన్ పై హత్యాయత్నం జరిగిందన్న సీఎం, మరోవైపు రాష్ట్రంలో సీబీఐని అడుగుపెట్టనివ్వబోమని చెబుతున్నారని వ్యాఖ్యాలపై ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు.
పెద్ద నోట్లను రద్దుచేసి ప్రధాని మోదీ భారత ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసినందున ఏపీకి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలను తీసుకునేందుకు బాబు సిద్ధమవుతున్నారని ఆయన తెలిపారు. అందులో భాగంగా ‘మా నోట్లను మేమే ముద్రించుకుంటాం. మా మిలటరీని మేమే ఏర్పాటు చేసుకుంటాం. మా రైళ్లు, విమానాలను మేమే నడుపుకుంటాం అంటూ జీవో తెస్తారని విజయసాయి సెటైర్లు వేశారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2018