నారాలేకేష్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. గత కొన్ని రోజులుగా సోషియల్ మీడియాలో బాబు , లకేష్పై విమర్శలతో చెలరేగిపోతున్నాడు. తాజాగా మంత్రి లేకేష్పై మరో సారి సెటైర్లు వేశారు.
దొడ్డిదారిన మంత్రి పదవి చేపట్టిన నారా లోకేశ్ రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలెన్నో, ఐటీ కంపెనీలెన్నో ఆరు నెలలు ఆగితే లెక్కతేలుస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టిన ఆయన, ఎల్లో మీడియా సాయంతో దాచినంత మాత్రాన నిజాలు దాగవని అన్నారు. లోకేష్ సవాళ్లు వింటే అందరికీ నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడి బోగస్ కంపెనీలకు వందల కోట్ల విలువైన భూములు, రాయితీలిచ్చిన సంగతి ప్రజలు తెలుసన్నారు.
“లోకేష్ నాయుడు తెచ్చిన పరిశ్రమలెన్నో, ఐటి కంపెనీలెన్నో లెక్క తేలుస్తాం. 6 నెలలు ఓపిక పట్టు చిట్టి. కమిషన్లకు కక్కుర్తి పడి బోగస్ కంపెనీలకు వందల కోట్ల విలువైన భూములు, రాయితీలిచ్చింది ప్రజలకు తెలుసు. యెల్లో కుల మీడియా దాచిపెట్టినంత మాత్రాన ప్రజల కళ్లకు గంతలు కట్టలేరు” అని అన్నారు.
ప్రతిపక్ష నాయకుడు ఎండ, వానా తేడా లేకుండా ప్రజల మధ్య పాదయాత్ర చేస్తుంటే కనిపించడం లేదా? చిట్టీ’ అంటూ లోకేష్ను విజయసాయి వ్యంగ్యంగా ప్రశ్నించారు. వారంలో నాలుగు రోజులు అమరావతి, మూడు రోజులు హైదరాబాద్ దాటి రాని నువ్వా మమ్మల్ని విమర్శించేది అంటూ నిలదీశారు.