Thursday, April 25, 2024
- Advertisement -

ఇప్ప‌టికైనా తెలుసు కున్నారు…

- Advertisement -

2019 ఎన్నిక‌ల‌కు వైసీపీ వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్ బాద్య‌త‌లు తీసుకున్నాక‌…కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది పార్టీ. తన రాజకీయ కార్యాచరణను వేగంగా ముందుకు తీసుకుపోతోంది. ఇప్పటికే పలు సమస్యలపై దూకుడుగా స్పందిస్తున్న వైసీపీ ఇదే సమయంలో ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఇప్ప‌టికె ప్ర‌జ‌ల‌ల్లో రోజు రోజుకి ఆద‌ర పెరిగుతుండ‌టంతో మ‌రింత దృష్టి సారించింది.
ప్ర‌ధానంగా పార్టీ కార్యాల‌యం వెరొక రాష్ట్రంలో….కార్య‌క్ర‌మాలు ఇంకో రాష్ట్రంలో అస్స‌లు పొంత‌న కుద‌ర‌దు. ఎప్పుడో జ‌న‌గ్ తీసుకోవాల్సిన నిర్న‌యం ఇప్పుడు తీసుకుంటున్నారు. అక్టోబర్ లో జగన్ పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచకా సాగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఏపీ రాజధాని విజయవాడ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.
వైఎస్ జగన్ పాదయాత్ర కార్యక్రమ పర్యవేక్షణ మొత్తం ఏపీ నుంచే జరగాలని పార్టీ భావిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్ ఆర్ సీపీ రాష్ట్ర కార్యాలయం ఇప్పటికే నిర్మాణంలో ఉంది. అయితే ఇది పూర్తవ్వడానికి మరో ఏడాది పట్టనున్నందున తాత్కాలిక కార్యాలయాన్ని వైసీపీ సిద్ధం చేస్తోంది. విజయవాడ బందర్ రోడ్డులో మాజీ మంత్రి కొలుసు పార్థసారధికి చెందిన స్థలంలోనే తాత్కాలిక కార్యాలయ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇన్నాల్లు నిర్ల‌క్ష్యంగా వ్వ‌వ‌హ‌రించిన పార్టీ ప్ర‌శాంత్ కిషోర్ సూచ‌న‌ల‌మేర‌కే వేగంగా పావులు క‌దుపుతూ..అన్ని కార్య‌క్ర‌మాల‌ను ఏపీనుంచె వేగ‌వంతం చేయ‌డం మొద‌లు పెట్టింది. విజ‌య‌వాడ నుంచె పార్టీ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం ద్వారా ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందుకు పావులు క‌దుపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -