తెలంగాణలో జరగనున్న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్టీపీ పోటీ చేయట్లేదన్న విషయం తెలిసిందే. అయితే, నిరుద్యోగులతో వందల సంఖ్యలో నామినేషన్లు వేయించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆ పార్టీ అధినేత్రి షర్మిల ట్వీట్ చేశారు.
ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడి నడిపించి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది విద్యార్థులు. 7 ఏండ్ల తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాల నొటిఫికేషన్స్ కోసం మరో ఉద్యమాన్ని మొదలు పెట్టింది YSRTP. 7 వారాలుగా నిరుద్యోగ నిరాహార దీక్షలతో నిరుద్యోగుల పక్షాన నిలబడ్డాం.
‘కేసీఆర్కు గుణపాఠం చెప్పడానికి వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికలో వందల సంఖ్యలో నామినేషన్లు వేయించి కేసీఆర్ మెడలు వంచాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఇక నుంచి వైఎస్సార్ తెలంగాణ పార్టీ నిరుద్యోగ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తుంది. పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసే వరకూ యువత పక్షాన నిలబడుతుంది’ అని షర్మిల తెలిపారు.
Also Read: ఈకేవైసీ టెన్షన్ వద్దు.. నమోదు ఎప్పుడైనా చేసుకోండి: ఏపీ ప్రభుత్వం క్లారిటీ..!