Thursday, May 2, 2024
- Advertisement -

ఈకేవైసీ టెన్షన్ వద్దు.. నమోదు ఎప్పుడైనా చేసుకోండి: ఏపీ ప్రభుత్వం క్లారిటీ..!

- Advertisement -

సెప్టెంబర్ లోపు ఈ కేవైసీ పూర్తికాని రేషన్ కార్డుదారులకు సరుకుల సరఫరా పంపిణీ నిలిచిపోతుందని అధికారులు ప్రకటించడంతో కార్డుదారులు కొద్ది రోజులుగా మీసేవ, ఆధార్ కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. అక్కడ ఈ కేవైసీ నమోదు కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ప్రజల ఇబ్బందులను గమనించిన ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ కేవైసీ నమోదుకు గడువు ఎత్తేసింది. రేషన్ కార్డు దారులు ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించుకోవాలని.. అయితే ఇందుకు గడువు అంటూ ఏమీ లేదని..ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చని ప్రకటించింది.

ఈ కేవైసీ నమోదు పెద్దలకు ఆగస్టు వరకు, పిల్లలకు సెప్టెంబర్ వరకు గడువు ప్రకటించడంతో ఈ కేవైసీ నమోదును త్వరగా పూర్తిచేసుకోవడానికి ప్రజలు మీసేవ,ఆధార్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేవైసీ నమోదుకు గడువు అంటూ ఏమీ లేదని.. నమోదు ఎప్పుడైనా చేసుకోవచ్చని ప్రకటించింది.ప్రజలు మీసేవ, ఆధార్ కేంద్రాల వద్దకు గుమికూడవద్దని ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల కిందట వన్ నేషన్ -వన్ రేషన్ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రేషన్ కార్డు ఉన్నవాళ్లు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరుకులు తీసుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ కార్డుదారులు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకునేలా చూడాలని కోరింది. ఇందులో భాగంగా ప్రతి రేషన్ దారుడు తమ ఆధార్ డేటా తో ఈ కేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉంది.

రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న ఐదేళ్లలోపు పిల్లలకూ కొత్తగా నమోదు చేయించి ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఏపీలో ఈ-కేవైసీ నమోదుకు పెద్దలకు ఆగస్టు వరకు పిల్లలకు సెప్టెంబర్ వరకు గడువు ఇవ్వడంతో ఆధార్, మీ సేవా కేంద్రాల వద్దకు జనాలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ కేవైసీ నమోదు ప్రక్రియ కోసం గంటల తరబడి అక్కడే నిరీక్షిస్తున్నారు. దానికితోడు ఈ కేవైసీ నమోదు చేయించుకోకపోతే రేషన్ కార్డు రద్దు అవుతుందని ప్రచారం వ్యాపించింది. దీంతో ప్రజలు కూడా తొందరగా ఈ కేవైసీ ప్రక్రియ ముగించుకోవాలని ఆధార్, మీసేవా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు.

ఆధార్, మీసేవా కేంద్రాల వద్ద జనం రద్దీని గుర్తించిన ప్రభుత్వం.. కరోనా నేపథ్యంలో జనం ఒకచోట గుమికూడితే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఈ కేవైసీ ప్రక్రియకు గడువు అంటూ ఏమీ లేదని, ప్రజలు ఎప్పుడైనా ఈ కేవైసీని నమోదు చేసుకోవచ్చని తాజాగా ప్రకటించింది.ఈ కేవైసీ నమోదు చేసుకోకపోతే రేషన్ కార్డు రద్దు చేస్తారనేది అవాస్తవం అని పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ కోన శశిధర్ వెల్లడించారు. రాష్ట్రంలో ఇంకా ఇంకా 35 లక్షల మందికి పైగా ఈ కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు.

Also Read: ఏపీలో పాఠశాలలు ఇక పది గంటలు.. సెలవులను కూడా కుదించిన ప్రభుత్వం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -