తిన్నది అరగక ఎవడో కోతి తోక కొరికాడట. అలా ఉంది ఆ నలుగురు యవ్వారం చూస్తుంటే. చేతిలో బండి ఉంది కదా అని చెప్పి జంగిల్ కు వెళ్లిపోయి అక్కడ మృగరాజుతోనే ఆటలాడతానంటే ఎలా.తేడా వస్తే శాల్తీలు లెగిసిపోతాయి కదా. వీరు అనుకున్నంత పని చేశారు. చేతిలో ఎలాంటి వెపన్స్ లేకుండానే గిర్ అభయారణ్యంలోకి వెళ్లి….బైక్లపై సింహాల వేటను షురూ చేశారు. ఇపుడు సోషల్ మీడియాలో ఇదే పెద్ద హాట్ టాపిక్ అయింది.
ఇంతకీ ఈ నలుగురు ఎవరు.. ?
గుజరాత్ లోని గిర్ వన్యమృగ సంరక్షణ కేంద్రంలోకి బైక్ తో ప్రవేశించి… ఇష్టానుసారంగా బైక్ లు నడుపుతూ సింహాలను వెంటాడిన వీరి చేతిలో తుపాకుల్లాంటి ఆయుధాలు లేకపోయినా …. మృగాలను పరుగులు పెట్టించారు.ఇప్పటికైతే ఈ రెండు బైక్ లలో ఒక వాహనం నెంబరును మాత్రమే అటవీ శాఖ గుర్తించగలిగింది.సింహాలంటే ఏమాత్రం భయం లేకుండా వాటికి అతి సమీపంలోకి వెళ్లి…ఆ యువకులు చేసిన దుస్సాహసం అధికారుకు ఆశ్చర్యం కలిగించింది. అతి త్వరలో వన్యమృగ సంరక్షణ చట్టం క్రింద వీరిని పట్టుకుని అరెస్టు చేస్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.