దేశంలో టెలికాం రంగంలో ఓ రెంజ్ లో పోటీ కొనసాగుతోంది. జియో ఇచ్చిన దెబ్బకు ఇతర కంపినీలు ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తున్నాయి. కొత్త వారిని ఆకర్షించేందుకో రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నెపథ్యంలో అత్యధికంగా 28 కోట్ల యూజర్లను కలిగి టాప్ ప్లేస్లో ఉన్న ఎయిర్టెల్ మరో సరికొత్త ఆఫర్తో ముందుకు వచ్చింది.
అయితే ఎయిర్టెల్ కొత్త ఆఫర్ దేశ ఆర్థిక రాజధాని ముంబై వరకే పరిమితం. ముంబైలోని ఫిక్స్డ్ లైన్ కస్టమర్ల కోసం ఎయిర్టెల్ సరికొత్త బ్రాడ్బ్యాండ్ ప్లాన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఉచిత కాల్స్ను కూడా అందించనుంది.
వి-ఫైబర్ టెక్నాలజీ ఆధారంగా ఫిక్స్లైన్ ఫోన్లతో అధిక వేగంతో కూడిన డేటా కనెక్టివిటీని అందించేలా ఎయిర్టెల్ నెట్వర్క్ అప్గ్రేడ్ చేశారు. ఈ అప్గ్రేడ్ తో 100 ఎంబీపీఎస్ వరకు వేగంతో డేటాను ఇస్తారు. ఇక్కడ ఎయిర్టెల్కు ఉన్న 3.51 లక్షల మంది ఫిక్స్డ్ లైన్ కస్టమర్లు హైస్పీడ్ కవరేజీకి మారవచ్చు. ఈ కొత్త ప్లాన్ తీసుకున్న వారికి మూడు నెలల పాటు ఎలాంటి చార్జీలు ఉండవు. 10 జీబీ డేటా కలిగిన బేసిక్ ప్లాన్ 599 రూపాయలతో ప్రారంభమవుతుంది. 1,299 రూపాయల రెంటల్తో నెలకు 60 జీబీ డేటా ప్లాన్ను తీసుకునే వారికి ఉచిత అపరిమిత కాలింగ్ సదుపాయం కూడా కల్పిస్తోంది.
Related