దేశంలో రిలయన్స్ జియో ఇతర కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. దాంతో ఇతర కంపెనీలు జియో ఇచ్చిన ఆఫర్ల దెబ్బకు పోటీగా వివిధ ఆఫర్లతో రిలయన్స్ జియో కి షాక్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్ టెల్ కంపెనీ మరో కొత్త ఆఫర్ ప్రకటించింది.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కంటే చౌక ధరలను అందుబాటులోకి తీసుకొచ్చింది. యిర్టెల్ 4 జీ 10 జీబీ డేటాను కేవలం రూ.259 కే అందిస్తున్నట్టు ప్రకటించింది. వినియోగదారులు కొత్తగా కొనుగోలు చేసిన ఏ 4 జీ స్మార్ట్ ఫోన్ కైనా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ 10 జీబీలో 1 జీబీ డేటా తక్షణమే వినియోగదారుని ఖాతాలో జమ చేయబడుతుందనీ, మిగిలిన 9 జీబీ డేటా మై ఎయిర్ టెల్ ఆప్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చని ఎయిర్ టెల్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇక గరిష్టంగా 90 రోజుల్లో మూడుసార్లు రీచార్జ్ చేసుకునేందుకు ఈ తాజా ఆఫర్ అనుమతినిస్తుంది. కాగా ఆగస్ట్ లో రూ.250 రీచార్జ్ తో 10 జీబీ 4 జీ డాటను కేవలం శాంసంగ్ గెలాక్సీ జె సీరిస్ స్మార్ట్ ఫోన్లకుమాత్రమే ఆఫర్ చేసింది. తాజా ఆఫర్ ప్రకారం 4 జీ స్మార్ట్ ఫోన్లు అన్నింటికీ ఈ డాటా సేవలు వర్తింప చేస్తోంది.
Related