Sunday, April 28, 2024
- Advertisement -

బాబుపై బీజేపీ గుస్సా..!

- Advertisement -

చంద్రబాబు తీరే అంత… వేలు చూపిస్తే మండ మింగేస్తారు… గుడికి తీసుకెళ్తే గుడిని…లోపలి లింగాన్ని మింగేస్తారు… రాజకీయాల్లో ఈ విషయం పలుమార్లు స్పష్టమైనా.. గొర్రి కసాయి వాణ్ని నమ్మడం రివాజు ఎలాగో… బిజెపి వాళ్ళు చంద్రబాబును దశాబ్దాలుగా నమ్ముతూ మోసపోతున్నారు.

గతంలో టీడీపీతో పొత్తుపెట్టుకుని నిండా మునిగిన బీజేపీ మళ్ళీ ఈ ఎన్నికలకూ పొత్తుకు దిగింది. పాపం వీళ్ళను చంద్రబాబు నిండా ముంచేసి.. గోతిలో దించేశారు… గత ఇరవయ్యేళ్లలో ఎన్నడూ టీడీపీ గెలవని, ఖచ్చితంగా ఓడిపోయే సీట్లను బిజెపికి అంటగట్టేసి మీ సీట్లు మీకు కేటాయించేసాను … నేను మంచోణ్ని అంటూ కలరింగి ఇచ్చారు

అసలు విషయం మెల్లగా అర్థం చేసుకున్న బిజెపి సీనియర్ నాయకులూ అమ్మాడి… ఇంత ఘోరమా… ఇంత మోసమా.. చచ్చులు.. పుచ్చులు మాకు ఇచ్చేసి గెలిచే సీట్లు మీరు కాజేస్తారా అంటూ బాబు కుట్రను ఢిల్లీకి చేర్చారు… బీజేపీలో ఉంటూ చంద్రబాబుకు అనుకూలంగా పని చేస్తున్నారంటూ పురంధేశ్వరి మీద ఫిర్యాదు చేసారు. దీంతో ఢిల్లీ పెద్దలు తస్సాదియ్యా … బాబు ఇంకా మారలేదా…ఇంకా అదే కుట్రలా అంటూ ఎంపీ సీట్ల ప్రకటన వాయిదా వేశారు..

దీంతో బిజెపి వాళ్ళు ఆంధ్రాలో ఎంపీ సీట్ల సంగతి తేలిస్తే తప్ప టీడీపీ ఎంపీ అభ్యర్థుల సంగతి ఒక కొలిక్కి రాదు. అందాకా టీడీపీలో గలాటా కంటిన్యూ అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -